ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈ ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శితోపాటు సంబంధిత శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై చర్చించ నున్నారు. ప్రధానంగా సెక్షన్ 8పైనే చర్చ జరుగనున్నట్టు సమాచారం.రెండు తెలుగు రాష్ట్రాలకు 9, 10వ షెడ్యూళ్ళలో చేర్చిన సంస్థలపై కూడా చర్చ జరగ వచ్చని తెలుస్తోంది. ఓటుకు నోటు వ్యవహారంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మొదలైన వివాదం క్రమంగా హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు డిమాండ్ వరకు వచ్చింది. హైదరాబాద్లో సెక్షన్ 8 అమలుచేయాల్సిందేనని ఏపీకి చెందిన మంత్రులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో సెక్షన్ 8 అమలు చేస్తే ఒప్పుకునేది లేదని, ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందని, అమలు దిశగా చర్యలు తీసుకుంటే తాను స్వయంగా ఆమరణ దీక్షకు దిగుతానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇటీవల గవర్నర్తో భేటీయైన సందర్భంగా తేల్చి చెప్పారు.
అంతేకాకుండా పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు సెక్షన్ 8 అమలు చేస్తే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా సెక్షన్ 8 అమలు అంశం తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఢిల్లి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాల కారకాలను గుర్తించడం, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి గవర్నర్కు మార్గనిర్దేశం చేయడమే ఈ పర్యటన ఉద్దేశమని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే గవర్నర్ నరసింహన్ తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధాని నరేంద్రమోడీని కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more