ఆన్ లైన్ షాపింగ్ కు పెరుగుతున్న మోజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియాలో జరుగుతున్న బిజినెస్ లో దాదాపు 24శాతం ఆన్ లైన్ ద్వారానే జరుగుతోందని తేలింది. అయితే అంతకంతకు పెరుగుతున్న ఆన్ లైన్ షాపింగ్ లో మోసాలు కూడా పెరుగుతున్నాయి. అయితే మామూలుగా చిన్నా చితక ఆన్ లైన్ వెబ్ సైట్లు మోసాలకు పాల్పడున్నాయంటే ఆశ్చర్యపోవడం కాదు కానీ.. బడా బడా ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్స్ మోసాలకు తెర తీస్తున్నాయి. ఫోన్ బుక్ చేస్తే ఆన్ లైన్ లో రాళ్లు పంపించి మోసానికి పాల్పడించి అమేజాన్ సంస్థ అయితే తాజాగా ఫ్లిప్ కార్ట్ సంస్థ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ షాపింగ్ వెబ్ పోర్టల్స్ లో లీడింగ్ లో ఉన్న టాప్ వెబ్ పోర్టల్ ఫ్లిప్ కార్ట్ మోసానికి తెర తియ్యడం వార్తల్లో నిలిచింది.
ఇక తాజాగా ఫ్లిప్ కార్ట్ లో మూడు ల్యాప్ ట్యాప్ లను ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి ఒక పార్సిల్ మాత్రమే వచ్చింది. సరే కనీసం ఒక్కటైనా వచ్చింది కదా అనుకున్న అతనికి పార్సిల్ తెరిస్తే షాక్ తగిలింది. పార్సిల్ లో ల్యాప్ ట్యాప్ కు బదులుగా రాళ్లను పంపించారు. దాంతో నోరెళ్ల బెట్టారు సదరు వినియోగదారుడు. అయితే ఇలా నాకు మోసం జరిగింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఇదే తరహాలో మరో ఘటన కూడా జరిగిందని తెలిసింది. మొబైల్ ఫోన్ ను ఆర్డర్ చేస్తే ఇటుకలు పంపినట్లు మరో కస్టమర్ ఫోటోతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే 24 గంటల్లో రెండు సార్లు ఇలా ల్యాప్ ట్యాప్ లకు బదులుగా రాళ్లను పంపించడంతో ఫ్లిప్ కార్ట్ క్రెడిబిలిటి దెబ్బతింది. సోషల్ మీడియాలో దీనిపై కామెంట్ల వర్షం కురుస్తోంది. ల్యాప్ ట్యాప్ లకు రాళ్లు, ఫోన్లకు ఇటుకలు, బట్టలకు మట్టి లాంటి వస్తాయి బాబూ అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు నెటిజన్లు. అయితే దీనిపై ఫ్లిప్ కార్ట్ మాత్రం సరైన వివరణ ఇవ్వలేదు. జరిగిన దానికి చింతిస్తున్నాము అంటూ తీరిగ్గా పోస్ట్ చేశారు ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం. మరి మీకు కూడా రాళ్లు లేదంటే ఇటుకలు లేదా ఇంకేమైనా రావచ్చు జాగ్రత్త మరి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more