Chandrababu, KCR, TRS, Telangana, Jagan

Ap cm chandrababu naidu attacked on kcr and trs govt on note for vote scandal

Chandrababu, KCR, TRS, Telangana, Jagan

Ap cm Chandrababu naidu attacked on kcr and TRS govt on note for vote scandal. Chandrababu naidu warned KCR for his tapping.

ఏపి ముఖ్యమంత్రికి బీపీ ఎందుకంటే..

Posted: 06/09/2015 09:32 AM IST
Ap cm chandrababu naidu attacked on kcr and trs govt on note for vote scandal

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు ఫిట్ నెస్ గురించి అందరికి తెలుసు. అయితే గత వారం పది రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబు నాయుడకు తెగ చిరాకుతెప్పిస్తున్నాయి. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టు చెయ్యడంతో వివాదం రాజుకుంది. అయితే ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడినట్లు  ఆడియో టేపులు బయటకు రావడంతో చిలిచిలికి గాలి వానగా మారింది ఓటుకు నోటు వ్యవహారం. అయితే మొన్నటి దాకా స్వయంగా మాట్లాడని ఏపి సిఎం చంద్రబాబు నాయుడు మొత్తం వ్యవహారంపై మండిపడ్డారు. ఎక్కడాలేని ఆవేశాన్ని కూడగట్టుకొని గుంటూరు సంకల్పీ దీక్షలో ఊగిపోయారు. ఖబడ్దార్ అంటూ కేసీఆర్ కు,  టిఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. హైదరాబాద్ పై తెలంగాణకు ఎంత హక్కు ఉందో తమకూ అంతే హక్కు ఉంది అంటూ చంద్రబాబు ఉద్ఘాటించారు. అయితే ఇంతలా చంద్రబాబు నాయుడు ఆవేశపడటానికి కారణాలు బహుశా ఇవే కావచ్చు.

* ఏపిలో చంద్రబాబు నాయుడు ఇమేజ్ దెబ్బతింటోంది కాబట్టి
* ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాధం ఉంది అన్న అనుమానం కావచ్చు
* తన ఆడియో టేపుల మీద కూడా తాను మాట్లాడకపోతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది కాబట్టి
* ఆంధ్రా ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చంద్రబాబు నాయుడు అంటే నిజాయితీ అన్న ఇమేజ్ ను చెరిపోకుండా ఉండాలంటే కనీసం ఇప్పుడన్నా మాట్లాడాలని అనుకొని ఉండవచ్చు.
* ఏసీబీ తన దాకా వస్తుందేమోనన్న భయం కూడా కావచ్చు

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  KCR  TRS  Telangana  Jagan  

Other Articles