తెలుగుదేశం మహానాడులో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం మహానాడుకు తరలివచ్చిన పలాస ఎమ్మెల్యే శివాజీ, ఇచ్చాఫురం ఎమ్మెల్యే లను పోలీసులు అడ్డుకున్నారు. గుర్తింపు కార్డుకోసం అడిగినట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యేలు ఆగ్రహం చెందారు. మహానాడు ప్రవేశద్వారం వద్దనే బైఠాయించారు. ఈ నేపథ్యంలో ఎంపీ శివప్రసాద్ జోక్యం చేసుకుని పోలీసులకు నచ్చచెప్పి, ఎమ్మెల్యేలను లోనికి పంపించారు. వేలాదిమంది కార్యకర్తలు, నాయకులు తరలివచ్చిన మహానాడులో ఇలాంటి చిన్నచిన్న ఘటనలు మామూలే అని , ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు సర్దిచెప్పారు. ఈ ఉదయం నందమూరి బాలకృష్ణ కూడా పోలీసులతో వాదులాడినట్లు మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. మహానాడు మొదటి రోజే కాస్త గందరగోళ పరిస్థితులు ఎదురుకావడంతో కార్యకర్తల్లో అయోమయం కనిపించింది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more