టైటిల్ విజేత ఎవరో ఎవరో అని సాగిన ఐపిఎల్-8 సీజన్ ను ముంబై ఇండియన్స్ జట్టు సొంతం చేసుకుంది. ఐపీఎల్ టైటిల్ను ముంబై జట్టు గెలుచుకోవడం ఇది రెండోసారి. 2013లో తొలిసారి ముంబై జట్టు చాంపియన్గా నిలిచింది. ఐపిఎల్-8 ఫైనల్లో ముంబై జట్టు 41 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. ఈ ఫైనల్లో ముంబై జట్టు బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ దుమ్ము రేపింది. ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయినప్పటికీ కెప్టెన్ రోహిత్, మరో ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ జట్టుకు అండగా నిలిచి భారీ స్కోరు గట్టి పునాది వేశారు. మరోవైపు చెన్నై జట్టు అన్ని విభాగాల్లో విఫలమైంది. తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేయగా.. తర్వాత చెన్నై జట్టు 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్లు మైకెల్ హస్సీ, డ్వైన్ స్మిత్ ఆరంభం నుంచే భారీ షాట్లు కొట్టేందుకు ప్రయత్నించారు. కానీ ముంబై బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా సాధ్యప డలేదు.
ఈ సీజన్లో వరసగా తొలి ఐదు మ్యాచ్ల్లో ఓడిన ముంబై తరువాత దూకుడు పెంచింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టైటిల్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఐ.పి.ఎల్లో రోహిత్ శర్మ టైం నడుస్తోన్నట్టుంది. ఇప్పటికే తన జట్టుకు రెండోసారి ట్రోఫీ అందించాడు. 2013లో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే తన జట్టును ఛాంపియన్గా నిలిపాడు. గతేడాది జట్టును ఫ్లే ఆఫ్కు చేర్చాడు. ఇప్పుడు మరోసారి ఛాంపియన్గా నిలిపాడు. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఫైనల్ ఫైట్లో ముంబై ఆల్రౌండ్ షో చూపించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై బ్యాట్స్మెన్ అదుర్స్ అనిపించారు. ఓపెనర్ పార్ధివ్ పటేల్ పరుగుల ఖాతా తెరువకపోయినా.. మరో ఓపెనర్ సిమన్స్.. కెప్టెన్ రోహిత్ దూకుడుగా ఆడారు. స్మిత్ 45 బంతుల్లో 68 రన్స్ చేయగా.. రోహిత్ 26 బంతుల్లోనే 50 రన్స్ చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరికి తోడు చివర్లలో రాయుడు, పొలార్డ్ కూడా మెరుపులు మెరిపించారు. పొలార్డ్ 18 బంతుల్లో 3 సిక్సర్లతో 36 రన్స్ చేయగా.. రాయుడు 24 బంతుల్లోనే 36 రన్స్ చేశాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు చేసింది.
భారీ లక్ష్య చేధనలో చెన్నై ఆరంభం నుంచి తడబింది. ఓపెనర్ హస్సీ త్వరగా పెవిలియన్కు చేరడం చెన్నైను దెబ్బ తీసింది. తరువాత స్మిత్-రైనా కాసేపు క్రీజ్లో నిలిచినా ముంబైకు బ్రేక్ ఇచ్చాడు భజ్జీ. మొదట 57 రన్స్ చేసిన స్మిత్ను, తరువాత 28 రన్స్ చేసిన రైనాను పెవిలియన్కు పంపాడు. అక్కడ నుంచి చెన్నై వికెట్ల పతనం లాంఛనమైంది. భారీ హోప్స్ పెట్టుకున్న ధోనీ, బ్రావో కూడా ఫెయిలవ్వడంతో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలర్లలో మెక్లీన్గన్ 3, మలింగా, భజ్జీ చెరో 2 వికెట్లు తీసి.. తన జట్టుకు 41 రన్స్ తేడాతో ఘన విజయం అధించారు. కెప్టెన్ రోహిత్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more