ప్రధాని నరేంద్రమోడీ దంతెవాడలో పర్యటించనున్న నేపథ్యంలో మావోయిస్టులు బంద్ కు పిలుపు నిచ్చారు. మోడీ పర్యటనకు వ్యతిరేకంగాన ఈ రోజు, రేపు దంతెవాడ బంద్ కు మావోయిస్టులు పిలుపు నిచ్చిన నేపథ్యంలో పోలీసులు కనీవినీ ఎరుగని రీతిలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇలా ఉండగా తన పర్యటనలో భాగంగా మోడీ రెండు మోగా ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేస్తారు. రౌఘాత్ - జగదల్ పూర్ రైల్వే లైనుకు, మోగా స్టీల్ ప్లాంట్ రెండో దశకు మోడీ రేపు శంకుస్థాపన చేస్తారు. అలాగే కొంత మంది విద్యార్థులతో కూడా మోడీ భేటీ అవుతారు.
అయితే మోదీ పర్యటన చేసే ప్రాంతంలో సుకుమా జిల్లాలో వందలాది మంది కనిపించకుండా పోయారు. ఎన్నికల తర్వాత మోదీ మొదటిసారిగా ఛత్తీస్ ఘడ్ లో పర్యటిస్తున్నారు.. కాబట్టి ప్రధానికి మావోలు ఇలా ఝలక్ ఇచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దాదాపు వందల మంది గ్రామస్తులను గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారని అనుమానం. అయితే మావోలు బంద్ కు పిలుపునిచ్చినా.. పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చునన్న అనుమానంతోనే మావోలు ఇలా గ్రామస్తులను ఎత్తుకెళ్లి ఉంటారని సమాచారం. అయితే గత బడ్జెట్ లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు మోదీ సర్కార్ భారీగా నిధులును కేటాయించింది. ముఖ్యంగా ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాల్లో కేంద్రం నిధులతో అభివృద్ది పనులు చెయ్యడం, అక్కడ మౌలిక వసతులను కల్పించడం లాంటివి మోదీ సర్కార్ చేపడుతోంది. బహుశా మోదీ సర్కార్ చర్యలకు ప్రతిగా గ్రామస్తులను ఇలా మాయం చేసి ఉండవచ్చని అధికారులు అనుకుంటున్నారు. మావోల కదలికలతో ప్రధాని మోదీ పర్యటించే ప్రాంతల్లో మరింత పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more