గతంలో ప్రతి వ్యక్తి చేతికి వాచు.. జేబులో పెన్ను ఉండేవి. కానీ ప్రస్తుతం వాటి స్థానంలో ఫోన్లు వచ్చేశాయి. అది కూడా మామూలు ఫోన్లు కాదు స్మార్ట్ ఫోన్లు. అయితే ఎంతో గారాబంగా చూసుకునే మొబైల్ అప్పుడప్పుడు కనిపించకుండా పోతుంది. ఆఫీసుకి వెళ్లే హడావుడిలోనో, పనుల ఒత్తిడిలోనో ఎక్కడో పెట్టేసి దాని కోసం వెతుక్కోవడం మొదలుపెడతాం. ఎక్కడికైనా తొందరగా వెళ్లాలనుకునే సమయంలో ఇలాంటి ఇబ్బంది మరింతగా ఆందోళనకు గురి చేస్తుంది. మీది ఆండ్రాయిడ్ ఫోన్ అయితే మాత్రం ఇక ముందు అలాంటి ఆందోళన అవసరం లేదంటోంది గూగుల్. వెంటనే కంప్యూటర్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ‘ఫైండ్ మై ఫోన్’ అని టైప్ చేస్తే చాలు ఆ మొబైల్ సుమారుగా ఎక్కడ ఉండి ఉంటుందన్న ఆచూకీ డెస్క్టా్పపై దర్శనం ఇస్తుందని చెబుతోంది. మొబైల్ పొరపాటున కారు సీట్లో ఉండిపోయినా, సోఫా కుషన్ల కిందకు దూరిపోయినా, మంచం మీద దిళ్లలో కూరుకుపోయినా క్షణాల్లో దాని ఆచూకీ చెప్పేస్తామని గూగుల్ తన బ్లాగ్పో్స్టలో తెలిపింది. కస్టమర్లు చేయాల్సిందల్లా ఒక్కటే... తమ రిజిస్టర్డ్ మొబైల్లో గూగుల్ ఆప్ లేటెస్ట్ వెర్షన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ స్మార్ట్ఫోన్ లొకేషన్ సర్వీసు ఆన్లో ఉంచుకోవడమే. అందులోని ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ఆ మొబైల్ రింగ్ అయ్యేలా చేస్తుంది. అందులోని రింగ్ ఆప్షన్ ఎంచుకుంటే మొబైల్ ఐదు నిమిషాల పాటు రింగ్ అవుతుంది. ఒకవేళ మొబైల్ ఎవరైనా దొంగిలించినా కూడా అందులోని విలువైన సమాచారాన్ని ఆ సర్వీస్ సహాయంతో ఇంట్లో ఎరేజ్ చేసేయవచ్చని గూగుల్ తెలిపింది. మొత్తానికి మొబైల్ పోయిందని తెగ టెన్షన్ పడే వాళ్లకు మాత్రం గూగుల్ మంచి వార్తే చెబుతోంది. కొత్త యాప్ ద్వారా మొబైల్ ను తొందరగా, ఈజీగా కనుక్కోవచ్చు. మరి మీ మొబైల్ కూడా కనిపించకుండాపోతే వెంటనే గూగుల్ చిట్కాను వాడండి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more