భారతదేశ స్వాతంత్రం పోరాటంలో పాల్గొన్న సుభాష్ చంద్రబోస్ పై నెహ్రూ ప్రభుత్వం ఇరవై సంవత్సరాలు నిఘా ఉంచడంపై దేశంలో దుమారమే రేపింది. అయితే నేతాజీ పై నిఘా గురించి దర్యాప్తు జరిపించాలని సుభాష్ చంద్రబోస్ సోదరుడి కొడుకు ప్రధాని నరేంద్ర మోదీని బెర్లిన్ లో కలిశారు. నేతాజీ మృతిపైనా, నెహ్రూ ప్రభుత్వం చేసిన నిఘా పైనా నిజాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. అందుకు స్పందించిన మోదీ నిజాలను నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే నేతాజీ కనిపించకుండా పోయిన ఆగస్టు 18, 1945 వరకు జరిగిన ప్రతి విషయాన్ని దర్యాప్తు చెయ్యాలని ఆదేశించారు. అందుకుగాను సుభాష్ చంద్రబొస్ కు సంబందించిన సీక్రెట్ ఫైళ్లను కూడా పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. రా, ఐబీ, కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో పాటు ప్రధాని కార్యాలయానికి చెందిన కొందరు అధికారులు ప్యానల్ లో ఉంటారు.
అయితే నేతాజీ కుటుంబం విన్నపాన్ని స్వీకరించిన వెంటనే ప్రధాని మోదీ దర్యాప్తును వేగవంతం చెయ్యడంపై నేతాజీ కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేతాజీకి సంబందించిన కొన్ని అంశాలను లిఖిత పూర్వకంగా రాసి మోదీకి ఇచ్చామని, వాటిని పరిశీలించిన మోదీ దర్యాప్తుకు ఆదేశించడం సంతోషం అని సుభాష్ చంద్రబోస్ సోదరుడి కొడుకు అంటున్నారు.]
కాగా నేతాజీ వ్యవహారం మాత్రం బిజెపి, కాంగ్రెస్ ల మధ్య మరోసారి నిప్పు రాజేసింది. కాంగ్రెస్ నాయకుల వ్యవహారంపై బిజెపి నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. నేతాజీ పై నెహ్రూ చేసిన నిఘా వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందొ.. మరెన్నికొత్త వివాదాలకు తావిస్తుందో అని కూడా కొందరు భయపడుతున్నారు. ఏది ఏమైనా నిజాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more