అత్యంత కీలకమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో అత్తాపత్తా లేకుండా పోయిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఆ తర్వాత ఎక్కడున్నాడో? ఏం చేస్తున్నాడో? అన్న విషయాలు ఎవరికీ తెలియరాలేదు. అప్పుడెప్పుడో పర్వతప్రాంతాల్లో వున్నట్లు ఓ ఫోటో హల్ చల్ చేసింది కానీ.. మళ్లీ అప్పటినుంచి ఆయన జాడ లేదు. ఆత్మ పరిశీలన కోసంమంటూ వెళ్లిన రాహుల్.. ఇక అప్పటినుంచి అతని రాక ఎప్పుడున్న విషయం ఎంతో ఆసక్తికరంగా మారింది. ఆయన ఎప్పుడు తిరిగొస్తాడోనన్న విషయాన్ని పార్టీ సభ్యులుగానీ, సోనియాగాంధీగానీ ఎవ్వరూ స్పందించలేదు. త్వరలోనే వస్తారని చెబుతూ ఆ మాటను దాటవేస్తూ వస్తున్నారే తప్ప.. అధికారికంగా స్పష్టం చేయలేదు.
అయితే తాజాగా వస్తున్న వార్తలప్రకారం ఈరోజు (13-04-2015) రాహుల్ గాంధీ తిరిగి వస్తున్నాడనే ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. దాదాపు నెలరోజులకుపైగా సెలవు తీసుకుని కంటికి కనిపించకుండా పోయిన రాహుల్.. ఇతని రాకపై అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ అతను వస్తున్నట్లు వస్తున్న వార్తలు మాత్రం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాహుల్ తిరిగొచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారా? లేక మరికొంతకాలంపాటు అమ్మ చూపిన బాటలోనే నడుస్తారా..? అన్నది ఆయన వచ్చిన తర్వాతే తెలుస్తుందని ఆ పార్టీ నేత మణిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు. అసలు ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని వుందా..? లేదా..? అన్న విషయం కూడా రాహుల్ వచ్చిన తర్వాతే తెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
రాహుల్ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తాడో లేదో తెలీదు కానీ.. అతని రాకపై నెలకొన్న సస్సెన్స్ వీడుతుందో లేదో వేచి చూడాల్సిందే! ఒకవేళ రాహుల్ వస్తే.. ఇతని రాకతో పార్టీలో మార్పులేమైనా వస్తాయా..? కొత్తగా ప్రణాళికలు ఏమైనా చేపడుతారా..? అసలు ఏమవుతుంది..? అనే సందేహాలు మెదులుతున్నాయి. ఏదేమైనా రాహుల్ రాక విషయం ఇప్పటికీ సీక్రెట్ గానే వుంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more