జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి పది రోజులు కూడా కాకముందే రాజకీయ దుమారం రేగింది. కరడుగట్టిన వేర్పాటువాది ఆలంను విడుదల చేస్తు అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశంలో సంచనానికి తెర తీసింది. అయితే భాజపా మద్దతుతో ఉర్పడిన జమ్ము కాశ్మీర్ లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో, పార్లమెంట్ లొ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టాయి. జమ్ముకశ్మీర్లో సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి పీడీపీ మెట్టు దిగింది. రాష్ట్రంలో ఇక ‘విడుదలలు’ లేవని ముఫ్తీ మహ్మద్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాజకీయ ఖైదీలెవరినీ విడుదల చేసేది లేదని హోంశాఖ కార్యదర్శి సురేష్కుమార్ ప్రకటించారు. కరడుగట్టిన వేర్పాటువాది మసరత్ ఆలం విడుదలపై కశ్మీర్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత నిర్మల్ సింగ్ పార్టీ అధ్యక్షుడు అమిత్షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితిపై ఆయనతో చర్చించారు. మిలిటెంట్లు, వేర్పాటువాదుల విడుదలపై ఏకపక్ష నిర్ణయాలు ఇక సహించం. అధికారం మాకెంత మాత్రం ముఖ్యం కాదు బిజెపి పార్టీ నుండి ప్రకటన వచ్చింది. దాంతో ముఫ్తీ సర్కారు దిగివచ్చింది.
అయితే, ఆలం విషయంలో ప్రజా రక్షణ చట్టాన్ని(పీఎస్ఏ) మళ్లీ ప్రయోగించే వీలు లేనందువల్లే అతడు విడుదలైనట్లు జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం వెల్లడించింది. సుప్రీం తీర్పు ప్రకారం ఈ చట్టంకింద ఎవరినైనా గరిష్ఠంగా ఆరు నెలలు నిర్బంధించవచ్చునని, అటుపైన ఒకసారి మాత్రమే పొడిగించే వీలుంటుందని వివరించింది. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కూడా జాతీయ భద్రతకన్నా సంకీర్ణంలో కొనసాగడం తమకు ముఖ్యం కాదని ఘజియాబాద్లో ప్రకటించారు. కశ్మీర్ సీఎం మరో 800 మందిని విడుదల చేయనుందన్న వార్తలపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు వివరణ కోరాయి. అలాంటిదేమీ లేదని, ప్రభుత్వ వైఖరిని ప్రధాని, హోంశాఖ మంత్రి ప్రకటించారని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్జైట్లీ ఉభయసభల్లో స్పష్టం చేశారు. అలా ప్రస్తుతానికి రాజకీయ ఖైదీలను విడుదల చెయ్యడం లేదని జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటన చేయడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more