పట్టుమని పదిహేను రోజులు కూడా కానేలేదు, బాలారిష్టలు కూడా తీరనే లేదు. కానీ అప్పుడే జమ్మూ,కాశ్మీర్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పిడిపి, బిజెపిల మధ్య విభేదాలు తలెత్తాయి. హురియత్ నాయకుడు మసరత్ ఆలంను విడుదల చేయటంతో ఈ రెండు పార్టీల మధ్య వివాదం తలెత్తింది. జమ్మూ,కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరగటానికి పాకిస్తాన్, హురియత్తోపాటు పలు ఇతర సంస్థలకు దోహదపడ్డాయని ముకఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ పదవి చేపట్టిన రోజే ప్రకటించటంతో రెండు పార్టీల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. పిడిపి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఆలం విడుదల గురించి తమతో చర్చించలేదని బిజెపి నాయకులు అంటున్నారు. పిడిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సహించేది లేదని బిజెపి చెబుతోంది. కాగా పిడిపి మాత్రం కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రకారమే మసరత్ ఆలంను విడుదల చేశారని వాదిస్తొంది.
పిడిపి-బిజెపి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన గంటలోనే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగినందుకు రాష్ట్ర ప్రజలకు, భద్రతా దశాలకు, ఎన్నికల కమిషన్కు కృతజ్ఞతలు చెప్పడానికి బదులు వేర్పాటువాదులు, టెర్రరిస్టులు, పాకిస్తాన్కు కృతజ్ఞతలు తెలుపుతూ ముఫ్తీ మహమ్మద్ చేసిన ప్రకటన పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేసింది. తాజాగా మసరత్ ఆలం విడుదల బిజెపిని మరోసారి కష్టాల్లో పడవేయనున్నది. మసరత్ ఆలం విడుదలపై బిజెపిని పార్లమెంటులో నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. దేశద్రోహులు విడుదల అవుతుంటే మీ దేశభక్తి ఏం చేస్తోందని ప్రతిపక్షం పార్లమెంటులో ప్రశ్నించనున్నది. ముఫ్తీ సరుూద్ తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల బిజెపి అధినాయకత్వం ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఇలాగే వ్యవహరిస్తూ పోతే సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలటం ఖాయమని వారంటున్నారు. 2010లో రాష్ట్ర రాజధాని శ్రీనగర్లో భారత వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన హురియత్ నాయకుడు మసరత్ ఆలం విడులపై అన్ని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. మసరత్ ఆలం విడుదలపై ప్రభుత్వం ప్రతిపక్షాల దాడిని ఎలా తిప్పికొడతాయో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more