జమ్ము కాశ్మీర్ లోసందిగ్దతకు తెర పడింది. రెండు నెలలుగా సాగుతున్న చర్చలు తుది రూపానికి వచ్చాయి. భాజపా, పిడిపి పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించాయి. అయితే పిడిపి భాజపాకు కొన్ని నిబంధనలు విధించింది. దాంతో చర్చల ప్రక్రియ మందగించింది. ఢిల్లీ ఎన్నికల తర్వాత భాజపా జమ్ము కాశ్మీర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదటుపెట్టింది. అందులో భాగంగా బిజెపి ప్రభుత్వ ఏర్పాటు కోసం కావాల్సిన కనీస మద్దతును పిడిపి నుండి ఆశిస్తోంది.
బిజెపి, పిడిపి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రిగా ముఫ్తి మహ్మద్ సయీద్, ఉప ముఖ్యమంత్రిగా బిజెపికి చెందిన నిర్మల్ సింగ్ లు ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. జమ్ము కాశ్మీర్ యూనివర్సిటి ఆడిటోరియంలో మార్చ్ ఒకటో తేదిన జమ్ము కాశ్మీర్ కొత్త ప్రభుత్వ ముఖ్యమంత్రి, మంత్రి వర్గం ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు. మొత్తం 14 మందితో కూడిన మంత్రివర్గం మార్చ్ ఒకటో తేదిన ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. జమ్ము కాశ్మీర్ హోం మంత్రిగా అబ్దుల్ రెహమాన్ పగ్గాలు చేపట్టనున్నారు. మొత్తానికి పిడిపి, భాజపా మధ్య పొత్తు కుదిరి జమ్ము కాశ్మీర్ లో కొత్ ప్రభుత్వం కొలువుదీరనుంది.
ఎన్నికల్లో భాజపా పూర్తి స్థాయి మెజారిటీ సాధించలేకపొయింది. అయితే పిడిపి తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి భాజపా ముందుకు రాలేదు. అయితే ఢిల్లీ ఎన్నికల తర్వాత కాశ్మీర్ ను వదులుకునే ఉద్దేశం లేని భాజపా ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అయితే పిడిపి భాజపా నుండి కొన్ని స్పష్టమైన హామీలను కోరింది. ఆర్మ్ డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, ఆర్టికల్ 370 పై భాజపా క్లారిటీ ఇవ్వాలని కోరింది. అయితే ఆర్మీకి అనుకూలంగా ఉన్న చట్టాన్ని సవరించాలన్న పిడిపి డిమాండ్ పై భాజపా సందిగ్దంలో పడింది. అయితే ప్రస్తుతం భాజపా25 సీట్లుచ పిడిపి 28 సీట్లను కలిగి ఉంది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more