సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నరేంద్రమోడీ చేసిన ప్రమాణాలు ప్రధాని అయిన 8 నెలలవరకు ఇంకా పూర్తి చేయలేదంటూ వాదనను లేవనెత్తిన కార్యకర్త అన్నాహజారే.. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగేందుకు సన్నద్ధం అయ్యారు. ఎన్నికల సందర్భంలో మోడీ జరిపిన ప్రచారాల నేపథ్యంలో ఆయన విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తిరిగి భారతదేశానికి తీసుకొస్తానని, లోక్ పాల్ బిల్లును అపాయింట్ చేస్తానని పేర్కొన్నారు. అయితే.. తానిచ్చిన మాటప్రకారం వాటిని బ్లాక్ మనీ తీసుకురావడంలోనూ, లోక్ పాల్ బిల్లును ప్రవేశపెట్టడంలో మోడీ విఫలమయ్యారని అన్నాహజారే వెల్లడించారు.
ఈ విషయమై అన్నాహజారే మాట్లాడుతూ.. ‘‘ప్రధాని కావడానికి ముందు మోడీ విదేశాల్లో వున్న నల్లధనాన్ని తీసుకొస్తానని పేర్కొన్నారు. అలా తీసుకొచ్చిన ఆ నల్లధనంలోని రూ.15 లక్షలు ప్రతిఒక్క ఇండియన్ బ్యాంక్ అకౌంట్’లో డిపాజిట్ చేయబడుతుందని వాగ్దానం చేశారు. అయితే.. ఎన్టీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్న రూ.15 లక్షలు కాదుకదా.. రూ.15 కూడా ఇంతవరకు ఎవరికీ దక్కలేదు. నల్లధనం, లోక్ పాల్ బిల్లు నియామకంపై మాట్లాడేందుకు మోడీ నిరాకరిస్తున్నారు. గతంలో మోడీ చెప్పిన మాటలకు, ఇప్పుడు ఆయన అనుసరిస్తున్న విధానాల్లో ఎంతో వ్యత్యాసం వుంది. ఆ రెండింటిని పూర్తి చేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి.. త్వరలోనే ఆందోళనకు దిగేందుకు సిద్ధమవుతున్నాను’’ అని ప్రకటించారు.
అయితే.. గతంలో ఈయనకు సహకారం అందించిన వారందరూ ఇతర పార్టీల్లో జాయిన్ అవడమో, సొంత పార్టీ పెట్టుకోవడమో చేశారు. దాంతో అన్నాహజారే ఒంటరి వారయ్యారు. అయినప్పటికీ ఈ 77 ఏళ్ల కార్యకర్త ఒంటరిగానే ఎన్డీయే ప్రభుత్వంపై పోరాటం సాగిస్తానని అంటున్నారు. ఈ ఉద్యమంలో భాగంగానే దేశం నలుమూలల వుండే తెలివైన కార్యకర్తలు తనకు అండగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more