కాంగ్రెస్ నేతలకు కేంద్రంలో అధికారం పోయినా.. వారి తప్పులను తెలుసుకోవడంలో మాత్రం విఫలమవతున్నారు. ఇలాంటి నేతలపై కాంగ్రెస్ అధిష్టానం కూడా మౌనం వహించి వేచి చూస్తామన్న దోరణిని అవలంభించడం కూడా ప్రజలల్లోకి తప్పడు సంకేతాలను ఇస్తుంది. నిండా మునిగాక చలి ఎందుకు అన్న చందంగా పోయిన పరువు ఎలాగో పోయింది.. ఎదురుదాడితోనే తమను తాము రక్షించుకుందామన్న దోరణిని అవలంబిస్తున్నారు. కేంద్రంతో మాకేం పని అన్నట్లుగా కేంద్ర నాయకులను చూసైనా బుద్ది తెచ్చుకోని రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకులు చేసిన తప్పులనే చేస్తున్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేజాడానికి అవినీతి, అక్రమాలతో పాటు అక్రమ సంబంధాలతో పాటు కేంద్ర మంత్రులు, ముఖ్యనేతల రాసలీలు కూడా మరో కారణంగా నిలుస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో వుండగా, అభిషేక్ మను సింగ్వీ కేంద్ర మంత్రి హోదాలో చేసిన నిర్వాకం అతని పదవీ చ్యుతుడిని చేసింది. అది అలా వుండగానే ఇటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శ హోదాలో దిగ్విజయ్ సింగ్ భాగోతం కూడా తెరకెక్కింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత బీజేపి నేత సుబ్రమణ్యస్వామి కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిదంబరానికి అప్ఘనిస్తాన్ మహిళలంటే యమా మోజని చేసిన వ్యాఖ్యాలను ఆయన కనీసం ఖండించనూ లేదు. అంతకు ముందు ఎన్డీ తివారీ అక్రమ సంతానం బాగోతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారి తీసింది.
ఇలా ఒకరి తరువాత ఒకరి అక్రమ లీలలు వెలుగుచూడటం కూడా కాంగ్రెస్ కు కేంద్రంలో అధికారం చేజారడానికి కారణం కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా కనీసం ప్రతిపక్ష హోదాను కూడా రాబట్టుకోలేని స్థితికి దిగజారడానికి నేతల అవినీతి, అక్రమాలు, రాసలీలలు, ఇలా ఒక్కటేమిటి అన్ని కారణాలుగా నిలుస్తున్నాయి. కేంద్రంలో ఇలాంటి వారినపై కనీసం చర్యలైనా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. రాష్ట్రాలలో ఇలాంటి ఆరోపణలు వచ్చిన నేతలపై కనీసం చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడుతోంది. ఇప్పటికే అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తూ.. విమర్శలను గుప్పిస్తున్న నేతలను ఎలా కట్టడి చేయాలో తెలియని కాంగ్రెస్ అధిష్టానం.. ఇక మిగిలిన వారిపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా.. స్పందించేందుకు విముఖంగా వున్నట్లు కనబడుతోంది.
{youtube}i6zzPIHg5h4|620|400|1{/youtube}
కర్ణాటకలో వరుస అత్యాచార ఘటనలు జరుగుతుండగా వాటిపై స్పందించని పాలకులు, అసెంబ్లీ సాక్షిగా అశ్లీల, అసభ్య చిత్రాలను వీక్షించడమే వారి ప్రజాసేవకు దర్పణం పడుతుంది. పాఠశాల విద్యార్థినిలపై అటెంటర్, స్కూల్ టీచర్, సాప్ట్ వేర్ ఇంజనీర్ పై అటో డ్రైవర్ వంటి వరుస ఘటనలతో బెంగళూరు వాసులు బెంగపుడతున్నా.. పాలకులు మాత్రం తమకేమీ పట్టలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాజ్యం సుభీక్షంగా వుండాలంటే.. రాజు పాలనతో పాటు మంత్రలు పరిశీలన, పర్యవేక్షణ కూడా ఎంతో అవసరం, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తే ప్రజల సమస్యలు, ఇబ్బందులే కాదు వారిపై జరుగుతున్న అత్యాచార ఘటనలు దూరమవుతాయి. ఆలా కాకుండా.. ముఖ్యమంత్రి ఓ దారిలో నడుస్తున్నా.. దారి తప్పిన మంత్రలు మరో దారిలో నడిస్తే.. ఇలాంటి ఘటనలు జరగక మారేమీ జరుగుతాయ్.. మంత్రులే చూడగా లేని తాము చేస్తే తప్పేమిటని మగ మృగాళ్లకు వారు మరింత బలాన్ని. పరోక్షంగా ప్రోత్సహాన్ని అందించినట్లు అవుతుందన్న ఆందోళనను కూడా వ్యక్తమవుతున్నాయి.
కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాల్లో మంత్రిగా వుండి అశ్లీల, అసభ్య నృత్యాలను వీక్షించిన కర్ణాటక మంత్రి, సినీనటుడు అంబరీష్ పై ఎలాంటి చర్యలను తీసుకోని అధిష్టానం.. అతిని అంశంపై మౌనవత్రాని పాటించడం కర్ణాటక వాసుల్ని మరింత భయాందోళనకు గురిచేస్తుంది. అధిష్టానం మౌనం వహించడాన్ని తన బలంగా తీసుకున్న అంబరీష్ ఏకంగా ఎదురుదాడికి దిగాడు. మీడియానే దోషిని చేసే ప్రయత్నం చేశాడు. నిన్న బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ, తానేం చెప్పినా అందుకు మీడియా వ్యతిరేకార్థాలు తీస్తోందని, అంతేకాక తన వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగేలా మీడియా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సువర్ణసౌధ ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. తాను రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన తనకంటూ వ్యక్తిగత జీవితం ఉండదా? తాను తన బిడ్డలు, మనవలకు ముద్దిస్తే కూడా విపరీతార్థాలు తీస్తారా? ఇది ఎంతమాతం మంచిది కాదు. మంచి విషయాలను ప్రజలకు తెలియజెప్పండి. ఇప్పుడు తాను మాట్లాడిన మాటలు పత్రికల్లో, టీవీల్లో వస్తాయా లేదా..' అంటూ మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇదిలావుండగానే అంభరీష్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి... ఓ బార్లో మందుకొట్టి... హిందీ సాంగ్కు డ్యాన్స్ చేస్తూ... కెమెరాకు చిక్కారు. కాగా ఇది ఆయన వ్యక్తిగతం అని మద్దతుదారులు అంటున్నారు. అయితే.. ఇలా మందుకొట్టి.. మజా చేస్తున్న మంత్రికి.. ఇటీవలే.. కోటి 22 లక్షలు ప్రభుత్వ నిధులతో సింగపూర్లో వైద్యం చేయించుకోవడలో ఆంతర్యమేమిటని.. ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇదేకాదు.. గతంలో ఓ అమ్మాయిని అంబరీష్ ముద్దుపెట్టిన ఫోటో కూడా సంచలనం సృష్టించింది. దీనిపై ప్రతిపక్షాల ఆందోళన నేపధ్యంలో.. ఒకరు కాదు... 350 మంది అమ్మాయిలను కిస్ చేశానంటూ... మంత్రి అంబరీష్ రిప్లయ్ ఇవ్వటం గతంలో పెద్ద దుమారానికి దారి తీసింది. అంబరీష్ బహిరంగంగా చేస్తున్న వికృత చేష్టలపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలే మండిపడి అదిష్టానం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారంటే.. ఇలాంటి మంత్రులు రాజకీయాల్లో కోనసాగే అర్హత వుందా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఇప్పటికైనా ఇలాంటి నేతలపై తక్షణం పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోని పక్షంలో కాంగ్రెస్ పార్టీ మరింతగా పట్టును కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ అంశంపై ప్రతిపక్షాలు గొల్లుమంటున్నాయి. మంత్రిగా అంబరీష్ చేసిన నిర్వాకం ప్రతిపక్షాలకు మంచి ప్రచార అయుధంగా మారుతుందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
{youtube}7WBa49ICZM|620|400|1{/youtube}
గతంలో బీజేపి అధికారంలో వుండగా కూడా అక్కడి శాసనసభలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బీజేపి అధికారంలో సదానంద గౌడ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న తరుణంలో, ఫిబ్రవరి 7న అప్పటి మంత్రులు లక్ష్మణ్ సవ్విడి, సిసి పాటిల్, క్రిష్టా పాలేమర్ కూడా ఇదే తరహాలో అసెంబ్లీలో అశ్లీల చిత్రాలను వీక్షిస్తూ పట్టుబడ్డారు. అయితే దీనిపై స్పందించిన బీజేపి ప్రభుత్వం, విపక్షాల వత్తిడికి తలొగ్గి వారిని స్పస్సెండ్ చేసింది. మంత్రులుగానే కాకుండా, వారిని ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేయాలని పార్టీ అధేశించింది. అప్పుడు వాళ్లే కాదు ఇప్పడు అంబీరష్ కూడా అదే తరహాలో అశ్లీల చిత్రాలను వీక్షించారు. ఇలా చకచకా చర్యలు తీసుకోవడంలో మాత్రం కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అప్పట్లో కాంగ్రెస్ ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా కూడా చేసుకుంది. మరి ఇప్పడు బీజేపి కూడా అదే చేయనుంది.
అంబరీష్ మీడియాపై కస్సుమంటూ తన ఆగ్రహాన్ని వెల్లగక్కారు, కానీ ప్రజాప్రతినిధిగా, ఒక నటుడిగా, అంతకు మించి మంత్రిగా తాను తన ప్రజలందరినీ తన కుటుంబంగా బావించాలి. అందమన అమ్మాయిని ముద్దుపెట్టుకున్న అంబరీష్ ఎప్పడైనా.. తన మంత్రిగా వున్న హాయంలో కుష్టురోగులను తన బిడ్డలు, మనువరాళ్లుగా భావించి ముద్దు పెట్టుకున్నారా..? అన్న ప్రశ్నలు సైతం వినబడుతున్నాయి. ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి పదవులను అలంకరించగానే.. తాము ప్రజాసేవకులమన్న విషయాన్ని మర్చి పోవడం అమాత్యుల స్థాయిలో వున్న వ్యక్తులకు ఎంత వరకు సమంజసం. బార్ లో మందు కోడుతూ చిందులు వేయడం ఎ మేరకు ప్రజా సేవ. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటని కాదు.. అనేక తప్పిదాలను ప్రజలు పట్టుగోగలరు. గర్తుపెట్టుకోనూ గలరు. సమయం వచ్చినప్పుడు వారి తీర్పుతో తలరాతలు మార్చనూగలరు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more