వినడానికే ఆశ్చర్యకరంగా వున్నప్పటకీ .. ఇది నమ్మలేని నిజం. ఒకరు కాదు ఇద్దరు కాదు, వందల సంఖ్యలో జరుగుతున్న ప్రమాదాలకు ఆ రోడ్డు నెలవుగా మారింది, ఫలితంగా ఏడాదికి సగటున వెయ్యి మంది ప్రాణాలను మృత్యు రహదారి బలితీసుకుంటోంది. రోడ్డు విస్తరణకు ముందు రద్దీతో అనేక చోట్ల ట్రాఫిక్ స్థంబింపజేసిన ఈ రోడ్డు.. నాలుగు లేన్ల విస్తరణ తరువాత.. కిల్లర్ రహదారిగా మారింది. హైదరాబాద్- విజయవాడ మధ్య నిర్మించిన 65వ నెంబరు జాతీయ రహదారి మృత్యుమార్గంగా మారుతోంది. నాలుగు వరసల విస్తరణతో ఉన్న 65 నెంబరు రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే అవి కూడా నల్గొండ జిల్లాలోనే ఎక్కువగా జరుగుతుండడం గమనార్హం.
అతివేగం.. అభద్రత: 65వ నెంబరు జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నల్గొండ జిల్లాలో 181 కి.మీ. పొడవుతో నాలుగు లైన్ల రహదారి ఉంది. దీనిపై వాహనాలు 85 కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణించాలనే నిబంధన ఉంది. కానీ, సగటున 125 నుంచి 150 కి.మీ. వేగంతో పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్ దాటిన తర్వాత నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్కు చేరుకోగానే వాహన చోదకులు వేగం పెంచుతున్నారు. డ్రైవర్లు అతివేగంతో వాహనాలు నడపడంతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక తప్పుడు దారిలో(రాంగ్ రూట్) వెళ్లే వాహనాలను పోలీసులు నియంత్రించడం లేదు. జాతీయ రహదారిపై హెచ్చరికలు, సూచిక బోర్డులు కూడా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
గత కొంత కాలంగా ఈ రోడ్డుపై ప్రయాణించి ప్రమాదాలకు గురైన వారు, ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను ఇలా వున్నాయి... గత ఏడాది ఇదే రహదారిపై నార్కట్పల్లి శివారులో టీడీపీ సీనియర్ నేత లాల్జాన్బాషా కూడా దుర్మరణం పాలయ్యారు. 2013 ఆగస్టు 15న హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన బాషా కారు నార్కట్పల్లి బైపాస్ జంక్షన్ వద్ద ప్రమాదానికి గురైంది. 2002లో చిట్యాల మండలం పెద్దకాపర్తి బస్టాండు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వేమవరపు లక్ష్మీప్రసన్న, ఆమె భర్త రత్నాకర్ బాబూరావు మృతిచెందారు. కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం వద్ద గత సెప్టెంబరు 28న యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నారాయణ దంపతులు కూడా ప్రమాదానికి గురయ్యారు. ఘటనలో నారాయణ సతీమణి మృతి చెందారు.
2009 మార్చి 26న జరిగిన రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల, హాస్యనటుడు శ్రీనివాస్రెడ్డిలు ప్రమాదానికి గురై గాయాలతో బయటపడ్డారు. కట్టంగూర్-కేతేపల్లి మధ్య సినీ నటుడు సునీల్ ప్రయాణిస్తున్న కారు కూడా ప్రమాదానికి గురైంది. నిత్యం ఇలా ఎంతో మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. 65వ నెంబరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ.. గత రాత్రి సినీనటుడు నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more