మనిషి ఆశకు ఓ హద్దంటూ ఉంటుంది. అది ఆకాశం నుంచి ఇప్పుడు పాతాళానికి పాకుతోంది. అంతరిక్షంలోకి రాకెట్లను పంపి.. పొరుగు గ్రహాలపై పరిశోధనలు చేస్తున్న మానవులు, చంద్రుడిపై ఇళ్లు కట్టే పనిలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో సంచలన వార్త బయటకు వచ్చింది. టెక్నాలజి దిగ్గజం జపాన్..., ఏకంగా సముద్రంలోపల ఇళ్ళను కట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఒకటి రెండు కాదు.., ఏకంగా నగరాలనే నిర్మిస్తుందట. వినటానికే ఆశ్చర్యంగా ఉంటే.., ఆ ఆలోచన వచ్చిన, అమలు చేస్తున్నవారిని ఇంకేమనాలి.
జపాన్ భూరంగా చూస్తే., చిన్నదేశమైనా జనాభా మాత్రం ఎక్కువ. దీంతో భూముల ధరలు విపరీతంగా ఉంటాయక్కడ. ఇళ్లు కట్టుకునేందుకు కొత్త స్థలాలు కరువు కావటంతో., కొత్తగా ఆలోచన చేశారు. సముద్రం లోపల బోలెడంత స్థలం ఉంటుంది, అక్కడ కడితే ఏ గొడవ ఉండదు కదా అనుకున్నారు. ఈ ఆలోచన వచ్చింది షిమిజు అనే ప్రముఖ నిర్మాణ సంస్థకు. పెరిగే భూమల ధరలకు అడ్డుకట్ట వేయాలంటే సముద్రంగర్బంలో కాలనీలు కట్టేస్తే సరి అనుకున్నారు. అంతేకాదు ఇదంకోసం ఇప్పటికే డిజైన్ కూడా రూపొందించారు. ఇక షిమిజు సంస్థ తన వంతుగా ఈసిటీ కోసం 16 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. 2030 నాటికి ఈ నగరం నిర్మాణం పూర్తవుతుందట. అంటే మరో 15 సంవత్సరాల్లో సముద్ర సిటీ ఏర్పడనుంది.
‘అట్లాంటిస్’ పేరుతో నిర్మిస్తున్న ఈ నగరం గోళాకారంలో ఉంటుంది. కేవలం ఇళ్ళే కాకుండా హోటళ్ళు, షాపింగ్ కాంప్లెక్స్ సౌకర్యాలు కూడా ఉంటాయట. ఈ నగరంలోకి వెళ్లి వచ్చేందుకు ప్రత్యేక రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తారట. అన్నీ బాగానే ఉన్నాయి కాని ఈ సిటిలో ఇంటి రేటు ఎంతో చెప్పలేదు. ఎప్పుడుపడితే అప్పుడు భూకంపాలు వచ్చే దేశమైన జపాన్ లో భూమిపై ఇళ్ళు కట్టకపోవటం అంటే ఫ్యూచర్ ప్లాన్ అనుకోవాలి కాని.., సముద్రంలోపల సిటీ అంటే ఒక్క భూకంపం వచ్చిందో ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది. ఇన్ని తెలిసిన వీరు దీనికి కూడా ఏదో విరగుడు వేసే ఉంటారు. ఇన్నాల్ళు రోడ్లకే పరిమితమైన ట్రాఫిక్ జామ్ లు., ఇకపై సముద్రంలోపల కూడా అవుతాయి. అక్కడ అయిపోతే గాల్లో కూడా మేడలు కట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more