విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటి పడతాయని ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడు నిజం అవుతున్నాయి. ఓ వైపు తెలంగాణ కొత్త పారిశ్రామిక విధానం ప్రకటించగా.., ఏపీ ప్రభుత్వం అంతకు మించిన ఆఫర్లు ప్రకటిస్తోంది. తాజాగా పెట్టుబడుల ఆకర్షణే ప్రదాన లక్ష్యంగా జపాన్ పర్యటన చేపట్టిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అక్కడి పారిశ్రామిక వేత్తలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. రాష్ట్రంలో జపాన్ కంపనీలు పెట్టుబడులు పెట్టేలా ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
జపాన్ పర్యటనలో భాగంగా.., వారం రోజుల అనుమతి ఆఫర్ ప్రకటించారు. తాజా ప్రకటన ప్రకారం, విదేశీ ప్రతినిధులు కంపనీల అనుమతి కోసం ఏపీకి వచ్చిన వారం రోజుల్లో అనుమతులు వస్తాయి. ఒకవేళ అలా రాని పక్షంలో ఎనమిదవ రోజు కంపనీలు పెట్టుబడులతో సహా వెనక్కి వెళ్లిపోవచ్చని ప్రకటించారు. జపాన్ పర్యటనలో భాగంగా ఎన్.ఐ.డీ.ఈ.సీ., ఎన్మార్ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు బృందం పారిశ్రామిక అభివృద్దిపై చర్చ జరిపింది. ఈ సందర్బంగా దేశంలో పేరుకున్న అలసత్వం, నిర్లక్ష్యం వల్ల వ్యాపారం చేయటం కష్టమవుతుందని జపాన్ వర్గాలు ప్రశ్నించగా.., ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. ఏపీకి వచ్చే కంపనీలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలకటంతో పాటు ఏడు రోజుల్లో అనుమతి రాకుంటే తిరిగి వెళ్ళేందుకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో విధానం ప్రకటించింది. దేశంలోనే తెలంగాణను పరిశ్రమల పరంగా ఆదర్శ రాష్ట్రంగా నిలబెడతామని ఆయన హామి ఇస్తున్నారు. ఇటు ఏడు రోజుల్లో అనుమతులు, అటు సింగిల్ విండో విధానం రెండు పోటాపోటి విధానాలే. రెండు తెలుగు రాష్ట్రాలు విమర్శలు చేసుకోవటంలో పోటితో పాటు అభివృద్ధిలో పోటి పడుతుండటం సంతోషకరమని విశ్లేషకులు అంటున్నారు. ఇదే స్నేహపూర్వక వాతవరణం రెండు రాష్ట్రాలు అభివృద్ధి పధంలో ముందుకెళ్ళటం ఖాయమని తెలుస్తోంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more