సమాజంలో అక్రమాలు అరికట్టాల్సిన పోలిసులే అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్న ఘటన మరొకటి వెలుగు చూసింది. తెలంగాణ పోలిస్ శాఖలో పనిచేస్తున్న ఓ సీఐ, మహిళా ఎస్సై బాగోతం బట్టబయలైంది. అసెంబ్లీ సమావేశాల బందోబస్తు కోసం వచ్చిన ఇద్దరూ హోటల్ లోని ఒకే గదిలో ఉండగా పోలిసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇంతకీ పట్టించింది ఎవరంటారా.., మహిళా పోలిసు భర్తే. ఆయనే తన భార్య తప్పుడు పని చేస్తోందని కంప్లయింట్ ఇవ్వగా ఆబిడ్స్ పోలిసులు అరెస్టు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే., కరీంనగర్ జిల్లాకు చెందిన సీఐ స్వామి, వరంగల్ జిల్లాకు చెందిన ఓ మహిళా ఎస్సై అసెంబ్లీ సమావేశాల బందోబస్తు డ్యూటి కోసం హైదరాబాద్ వచ్చారు. స్వామికి ఆబిడ్స్ లోని ద్వారకా హోటల్ లో రూమ్ కేటాయించారు. ఇక మహిళా ఎస్సైకి బృందావనం హోటల్ లో గది కేటాయించారు. అయితే సీఐ స్వామి తనకు కేటాయించిన రూంలో కాకుండా మహిళా ఎస్సైకి కేటాయించిన బృందావనం హోటల్ లోని రూంలో ఆమెతో కలిసి ఉన్నాడు.
అటు హైదరాబాద్ కు వచ్చిన మహిళా ఎస్సై భర్త, తన భార్య అక్రమ సంబంధం వ్యవహారంపై ఆబిడ్స్ పోలిసులకు ఫిర్యాదు చేశాడు. కంప్లయింట్ తీసుకుని వివరాలు చెక్ చేసుకున్న ఆబిడ్స్ పోలిసులు, బాధితుడితో కలిసి శుక్రవారం రాత్రి బృందావనం హోటల్ కు వెళ్లారు. అప్పటికే రూంలో సీఐ కూడా ఉండటంతో ఇద్దరూ అడ్డంగా బుక్కయ్యారు. ఇంకేముంది అక్రమంగా గుట్టు సాగిస్తున్న ఇద్దరినీ ఆబిడ్స్ పోలిసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తన భార్య సీఐతో కలిసి వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని మహిళా ఎస్.ఐ. భర్త సునీల్ కంప్లయింట్ లో పేర్కొన్నాడు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more