దేశం ఎంతగా అభివృద్ది చెందుతుందో కొన్ని విషయాల్లో సమాజం అంతే వెనక్కి వెళ్తోంది. పాతకాలపు ఆచారాలు, సాంప్రదాయాలే కాదు.., హేయమైన విధానాలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో పంచాయతీ వ్యవస్థ ఇప్పటికీ చాలాచోట్ల కొనసాగుతోంది. ఇక్కడ చాలాసార్లు వివాదాస్పదమైన, భరించలేని శిక్షలు విధిస్తారు. వీటిని అతిక్రమిస్తే మరిన్ని శిక్షలు తప్పవు. అంతేకాకుండా బహిష్కరణలు, జరిమానాలు విధించి వేధింపులకు గురిచేస్తారు. ఇక శిక్షల్లో వర్గం, స్ర్తీ, పురుష తేడాలను బట్టి శిక్షలు అమలు చేస్తారు.
తాజాగా రాజస్థాన్ లో ఓ గ్రామంలో పంచాయతి పెద్దలు దారుణానికి పాల్పడ్డారు. 45సంవత్సరాల మహిళను వివస్ర్తను చేసి గాడిదపై ఊరేగించారు. ఈ కేసు వివరాలు చూస్తే.., బాధిత మహిళ తన మేనల్లుడిని చంపినట్లు ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఈ వివాదంపై పంచాయతీ పెట్టిన పెద్దలు, మహిళను దోషిగా నిర్ధారించారు. చేసిన తప్పుకు గాను.., బట్టలు విప్పదీసి గాడిదపై ఊరేగించాలని ఆదేశించారు. గ్రామ పెద్దల ఆదేశాల ప్రకారం, బాధితురాలిని వివస్ర్తను చేసి గాడిదపై ఊరిలో ఊరేగించారు.
ఈ విషయం తెలిసిన పోలిసులు చాలా సీరియస్ అయ్యారు. పంచాయతీ పేరుతో జరిగిన దారుణంను తెలుసుకుని కేసు పెట్టారు. సోమవారం వరకు ఈ కేసులో 30మందిని అరెస్టు చేశారు. ఘటనలో భాగస్వామ్యం ఉన్న మిగతావరి కోసం విచారణ మొదలు పెట్టారు. అటు బాధిత మహిళను రెస్య్కూ హోంకు తరలించి కౌన్సిలింగ్ అందిస్తున్నారు. అటు ఈ ఘటనపై మహిళా లోకం నుంచి విమర్శలు వస్తున్నాయి. బాధితురాలు నేరం చేసి ఉంటే పోలిసులకు అప్పగించాల్సింది పోయి ఆమెను అవమానించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నలు వస్తున్నాయి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more