ఈమధ్యకాలంలోని దొంగలు సినిమాలను ఆదర్శంగా తీసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకు నిదర్శనంగా తాజాగా హర్యానాలో జరిగిన బ్యాంకు దోపిడీనే తీసుకోవచ్చు. ఏవిధంగా అయితే సినిమాలో దుండగులు పక్కా ప్లానింగ్ తో బ్యాంకులను దోపిడీ చేస్తారో.. అలాగే హర్యానాలోని కొంతమంది దోపిడిదొంగల ఓ జాతీయ బ్యాంకును దోచేసుకున్నారు. ఈ దోపిడి విధానాన్ని పరిశీలించిన అక్కడి అధికారులు.. ఔరా అంటూ ఒక్కసారిగా నోరుతెరుచుకుని నిర్ఘాంతపోయారట! ఎవరో దుండగులు సినిమాలో వుండేవిధంగానే పక్కా ప్లానింగ్ వేసుకుని ఆ దోపడికి పాల్పడి వుంటారని అధికారులు భావిస్తున్నారు.
హర్యానాలోని గోహానా టౌన్ లో వుండే పంజాబ్ నేషనల్ బ్యాంకును కొంతమంది దుండగులు దోచేసుకున్నారు. అచ్చం సినిమాటిక్ పద్ధతిలోనే దొంగలు ముందుగానే ప్లానింగ్ వేసుకుని.. ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా బ్యాంకును దోచేశారు. ఈ బ్యాంకును దోచుకునేందుకు దొంగలు దగ్గరిలోని ఓ పాడుపడిన భవనం నుంచి ఈ బ్యాంకు వరకు భూమిలో ఏకంగా 125 అడుగుల సొరంగాన్ని తవ్వారు. 2.5 అడుగుల వెడల్పు వున్న ఈ సొరంగం సరిగ్గా బ్యాంక్ స్ట్రాంగ్ రూం వరకు వుండటంతో ఎవరో తెలిసిన వ్యక్తే ఈ దోపిడికీ పాల్పడి వుంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుండగా.. బ్యాంకు స్ట్రాంగ్ రూంలో మొత్తం 360 లాకర్లు వుండగా.. వాటిల్లో మొత్తం 90 లాకర్లను పగులకొట్టి కోట్లాది రూపాయల నగదును, నగలను దోచేసుకుపోయారు. ఈనెల (అక్టోబరు) 26వ తేదీన రాత్రి సమయంలో దోపడి జరిగివుంటుందని అధికారులు భావిస్తున్నారు. నెలరోజులుగా దొంగలు పకడ్బందీగా ప్లాన్ వేసి ఈ భారీ చోరీకి పాల్పడి వుంటారని వాళ్లు భావిస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. స్ట్రాంగ్ రూంలో సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేయకపోవడం దొంగలకు కలిసొచ్చిందని ఖాకీలు తెలుపుతుననారు. ఈ తరహాలోనే 2007లో కేరళలోని మలప్పురంలోగల చెలంబ్రా బ్యాంకు దోపిడీకి గురైంది కానీ.. దానికంటే ఇదే భారీ దొంగతనమని విశ్లేషకుల అభిప్రాయం!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more