అమ్మో..! అక్టోబర్..అంటూ కోస్తా జిల్లావాసులు వణికిపోతున్నారు. అక్టోబర్ పేరు చెబితేనే తీరప్రాంత వాసులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా జల్ తుపాన్, నీలం, పైలీన్, ప్రస్తుతం హుదుద్ తుపాను అల్లకల్లోలం సృష్టించడమే దీనికి కారణం. ఈనెల వచ్చిందంటే పెను తుపాన్లు ముంచేస్తాయని ప్రజల్లో కలవరం మొదలవుతుంది. చేతికందవచ్చిన పంటలను తుపాను పూర్తిగా ధ్వంసం చేస్తుందని రైతుల్లో ఆందోళన నెలకొంటుంది. ప్రధానమైన దసరా, దీపావళి పర్వదినాలతో కూడిన ఈ నెలలోనే అధిక సంఖ్యలో తీవ్రమైన తుపాన్లు వచ్చి తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగిస్తుండమే ఇందుకు కారణం. పండగ వేళ్ల ఇళ్లలో విషాదాన్ని నింపుతున్న అక్టోబర్ మాసం అంటేనే హడలిపోతున్నారు కోస్తావాసులు. తమ బతుకులను ఛిద్రంచేస్తున్న తుపాన్లతో, అక్టోబర్ నెలతో భయకంపితులవుతున్నారు.
ఈ ఏడాది కూడా కోస్తా ప్రజల భయం నిజమైంది. హుద్ హుద్ పేరుతో వచ్చిన పెను తుఫాను ప్రళయగీతాన్ని రచించింది. వేల కోట్ల రూపాయల అస్తులను ధ్వంసం చేసింది. గత ఏడాది అక్టోబర్ 10-15 తేదీల మధ్య పైలీన్, నవంబర్లో హెలెన్, లెహర్ తుపాన్లవల్ల కకావికలమైన సంఘటనలను ప్రజలు మరువకముందే ఈ ఏడాది హుదూద్ పెను విపత్తు ఉత్తరాంధ్రలో విధ్వంసం సృష్టించింది. 1891 నుంచి అందుబాటులో ఉన్న గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటి వరకూ 76 తుపాన్లు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. వీటిలో 31 అక్టోబర్లోనే రావడం గమనార్హం. అందుకే ఈ నెలను వాయుగుండాల (గండాల) మాసంగా కోస్తావాసులు అభివర్ణిస్తుంటారు.
123 ఏళ్లలో మొత్తం 76 తుపాన్లు రాగా అందులో 52 (మూడింట రెండొంతులు) అక్టోబర్, నవంబర్ నెలల్లోనే సంభవించాయి. రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద పెను విపత్తుగా నమోదైన దివిసీమ ఉప్పెన కూడా నవంబర్ నెలలోనే సంభవించింది. 1977 నవంబర్ 15-20 తేదీల మధ్య సంభవించిన దివిసీమ ఉప్పెన పదివేల మందిని పొట్టన పెట్టుకుంది. 123 ఏళ్లలో అత్యధిక (23) తుపాన్లు నెల్లూరు జిల్లాలోనే తీరం దాటాయి. మరో 16 కృష్ణా జిల్లాలో తీరం దాటాయి. కోస్తాలోని తొమ్మిది జిల్లాలు సముద్రతీరంలోనే ఉన్నా నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోనే ఎక్కువ తుపాన్లు తీరం దాటాయి. పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లో ఇప్పటి వరకూ ఒక్క తుపాను కూడా తీరాన్ని దాటిన దాఖలాలు లేవు. 1892 అక్టోబర్లో వారం వ్యవధిలోనే రెండు తుపాన్లు, 1987 అక్టోబర్లో పక్షం వ్యవధిలో మూడు తుపాన్లు ముంచెత్తాయి.
నైరుతి రుతుపవనాల కాలంలో కంటే ఈశాన్య రుతుపవనాల సమయంలో తుపాన్ల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరీ ముఖ్యంగా అక్టోబర్లోనే మనకు ఎక్కువ తుపాను విపత్తులు సంభవిస్తుంటాయి. 1891 నుంచి రాష్ట్రాన్ని 76 తుపాన్లు రాగా, వాటిలో 31 అక్టోబర్లోనే సంభవించాయి. ఈశాన్య రుతుపవనాల సమయంలో అధికంగా, తీవ్రంగా తుపాన్లు వచ్చి కోస్తా తీరంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో సముద్ర ఉష్ణోగ్రతలు తుపాన్లకు చాలా అనువుగా ఉంటాయని, అల్పపీడనాలు తుపాన్లుగా మారుతుంటాయని వాతావరణ నిపుణులు తెలిపారు.. అందుకే ఈ నెలల్లోనే మనకు అత్యధిక తుపాన్లు, విపత్తు నష్టాలు సంభవిస్తుంటాయన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more