మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు జరుగుతున్నపోరులో తమ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అక్టోబరు 15న జరగనున్న శాసనసభ ఎన్నికల కోసం నరేంద్రమోదీ ఈ నెల 4నుంచి ప్రచారం చేయతలపెట్టారు. ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపి వ్యూహ రచన చేస్తోంది. పార్టీ సీనియర్ నాయకులు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీలు కూడా మహారాష్ట్రలో ప్రచారం చేపట్టనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇటీవల రెండు పర్యాయాలు జరిగిన ఉప ఎన్నికలలో బీజేపికి ఎదురుగాలి వీచింది. తమవైన స్థానాలను కూడా కోల్పోయింది. అటు బీహార్, ఇటు ఉత్తర్ ప్రదేశ్ లలో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటాయి. దీంతో మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలలో తమ సత్తా చాటాలని పార్టీ నేతలు నరేంద్రమోడీకి ఇదివరకే కోరినట్లు సమాచారం. అదీ గాక, ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో వుండడం, అక్కడి ప్రభుత్వాలపై వ్యతిరేకత కూడా రావడంతో.. ఈ రెండు రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకునేందుకు మోడీ సన్నదమవుతున్నారని సమాచారం. కాంగ్రెస్ నుంచి అధికారాన్ని లాక్కుని తమ సత్తాను మరోమారు చాటాలని బీజేపి ఉత్సాహపడుతోంది.
ఈ నేపథ్యంలో మోడీ ఆయా రాష్ట్రాల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు పేర్కోన్నాయి. ఆయనతో పాటు పార్టీ స్టార్ ప్రచారకర్తల జాబితాలో వారి పేర్ల లేకపోవడంతో హర్యానాలో వారిద్దరు ప్రచారం చేయకపోవచ్చునని తెలుస్తోంది. పార్టీ వర్గాలు సమాచాం మేరకు.. అక్టోబరు 4 నుంచి ప్రారంభమయ్యే ప్రచారంలో భాగంగా ప్రధాని హర్యానాలో 10 ర్యాలీల్లో, మహారాష్ట్రలో 24 ర్యాలీల్లో పాల్గొంటారు. బీజేపి ముఖ్యమంత్రులు శివరాజ్సింగ్ చౌహాన్, రమణ సింగ్, వసుంధర రాజే, మనోహర్ పారికర్, ఆనందిబెన్ పాటిల్లతో పాటు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నాయకులు, కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ తదితరులు మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more