Its time for k chandrashekar rao

Telangana government, KCR, Ponnala Lashmaiah, daliths, women, Martyrs, students

Pcc chief ponnala critisizes kcr government

కేసీఆర్ నీకు రోజులు దగ్గరపడ్డాయి..

Posted: 09/13/2014 01:22 PM IST
Its time for k chandrashekar rao

కేసీఆర్‌కు నీకు రోజులు దగ్గర పడ్డాయ్, తెలంగాణ ప్రజలు నీపై భౌతికదాడులకు దిగే పరిస్థితి వచ్చింది అని తెలంగాణ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. దళితులు, మహిళలను కించపరిచేలా కేసీఆర్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి అలంకరించగానే సరిపోదని, ఆ పదవి హుందా తనాన్ని కాపాడాలని ఆయన సూచించారు. దళితుల ఓట్లు వేస్తేనే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.
 
ఇంత చేసినా.. కేసీఆర్‌ దళితులకు, మహిళలకు క్షమాపణలు చెప్పలేదని, ఇది ఆయన నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్‌కు చీమ కుట్టినట్టయినా లేదని ధ్వజమెత్తారు. ఎవరికి పడితే వాళ్లకు కోట్ల రూపాయలు ఇస్తున్న కేసీఆర్‌ అమరవీరుల కుటుంబాలను ఇంత వరకు ఆదుకోలేదని ఆరోపించారు. అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకరమైందన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారని విమర్శించారు. సమగ్ర సర్వేలు, భూ సర్వేలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను భయకంపితుల్ని చేస్తుందని విరుచుకుపడ్డారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన విద్యార్థులు ఆందోళన చేపడితే.. వారిపై లాఠీలు ఝుళిపించిన కేసీఆర్ కు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. విద్యార్థుల ఉద్యమాలతో, ఉద్యోగ సంఘాల సకల జన సమ్మెలతోనే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఎప్పడు నెరవేరుస్తుందని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన సర్పంచ్‌లను తొలగించడానికి కేసీఆర్‌ ఎవరు అని పొన్నాల ప్రశ్నించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana government  KCR  Ponnala Lashmaiah  daliths  women  Martyrs  

Other Articles