(Image source from: ys jagan mohan reddy gave leadership responsibilities to butta renuka)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తన పార్టీని బలోపేతం చేసుకునే పనిలో తీవ్రంగా మునిగిపోయినట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం వైకాపా నుంచి నాయకులు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఖాళీ అయిపోతూ వస్తోంది. అలాగే మహిళలకు సరైన గౌరవం దక్కడం లేదు ఆ పార్టీలో వున్న మహిళా నాయకుడు జగన్ పై వ్యతిరేకంగా విమర్శలూ చేశారు. దాంతో ప్రస్తుతం పార్టీలో వున్న సభ్యులు కూడా ఎక్కడ వీడిపోతారోనన్న పునరాలోచన చేసుకున్న జగన్.. తాను ముందుకు చేసిన తప్పులను సరిదిద్దుకునే పనిలో పూర్తిగా మునిగిపోయినట్లు వున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ తన పార్టీ పాలకమండళ్లను పునర్వ్యవస్థీకరించే పనిలో చాలా బిజీగా వున్నాడని సమాచారం!
అందులో భాగంగానే జగన్ తన పార్టీ నేతలకు నాయకత్వ బాధ్యతలను అప్పగించే పనిలో మునిగిపోయారు. ఎన్నికల్లో గెలిచిన వారికి ఒకరకంగానూ.. ఓడిపోయినవారికి మరో రకమైన బాధ్యతలను అప్పగించి.. తన పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నంలో వున్నట్టు తెలుస్తోంది. అందుకు తన పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులను, ప్రధానకార్యదర్శులను, రాజకీయ కార్యదర్శులను జగన్ నియమించుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికరమైన పేర్లు బయటికి వచ్చాయి. తన పార్టీని వదలేసి దూరంగా వెళ్లిపోతారనుకున్న నాయకులకు జగన పార్టీ బాధ్యతలను అప్పగించడం విశేషంగా మారిపోయింది. సదరు నాయకుల పేర్లను విన్న టీడీపీ పార్టీ కూడా షాక్ కు గురయ్యింది. అందుకు ఉదాహరణగా ‘‘బుట్టా రేణుక’’ను తీసుకోవచ్చు.
కర్నూలు ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక.. ఇప్పటికే ఒకసారి చంద్రబాబును కలిసింది. దీంతో ఆమె వైకాపాను వీడుతుందనే అభిప్రాయాలు జోరుగా వినిపించాయి. కానీ అంతోనే ఏమయిందో తెలీదు కానీ.. బుట్టా రేణుక, జగన్ కు వెళ్లి రాఖీ కట్టింది. దీంతో తమ పార్టీలోకి చేరుతుందని భావించిన టీడీపీకి షాక్ తగిలింది. ఆ తర్వాత బుట్టా తిరిగి టీడీపీ పార్టీవైపు చూడలేదు. వైకాపాలోనే కొనసాగుతూ.. ఆ పార్టీ బలోపేతం కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమంటూ తెలిపింది. దీంతో జగన్ ఈమెపై పూర్తి విశ్వాసంతో ఇప్పుడు తాజాగా పాలకమండలిలో స్థానం కల్పించినట్టు తెలుస్తోంది. పార్టీలో పనిచేస్తున్న అనేమంది నేతలతోపాటు బుట్టా రేణుకకు కూడా నాయకత్వ బాధ్యతలను అప్పగించి జగన్ మరోసారి వార్తల్లోకెక్కేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more