తిట్టుకోవటం కోసం కొత్త పదాలు కనిపెట్టాలంటే అది మన రాజకీయ నేతల వల్లే అవుతుంది. అందుకు అసెంబ్లీ అయితే వారికి సరైన వేదిక. ఒకరిపై మరొకరు తిట్టుకోవటానికి.. మాటల యుద్ధానికి.., చివరికి ఒక దశలోని ముష్టియుద్ధానికి కూడా అసెంబ్లీయే వేదికవుతుంది. తాజాగా ఏపీ ఆర్ధికమంత్రి యనమల అసెంబ్లీలో యనమల అన్న మాటలు కొద్దిసేపు గందరగోళానికి దారితీశాయి. శాసనసభలో డెమోక్రసి మాత్రమే ఉంటుంది.., జగనోక్రసి ఉండదని యనమల అన్నారు. ప్రతిపక్ష నేత అయినా., అధికార పక్ష నేత అయినా సభ నియమాలు, నిబంధనలు పాటించాల్సిందే అని స్పష్టం చేశారు. శాసనసభకూ కొన్ని నిబంధనలు ఉంటాయనీ.., వాటి ప్రకారమే సభ జరుగుతుందని సభా వ్యవహారాల మంత్రి హోదాలో స్పష్టం చేశారు.
అసెంబ్లి అంటే లోటస్ పాండ్ కాదు
కేవలం రాజకీయం కోసమే ప్రకటనకు ముందు చర్చ అంటూ వైసీపీ రాద్దాంతం చేస్తోందని యనమల విమర్శించారు. జగన్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించటానికి అసెంబ్లీ లోటస్ పాండ్, ఇడుపుల పాయ కాదన్నారు. రాజధానిపై మధ్యాహ్నం ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత వైసీపి తమ అభ్యంతరాలు, డిమాండ్లు తెలియజేయవచ్చన్నారు. రాజధాని ఎక్కడ అనే విషయం ప్రకటించకుండా ఎలా చర్చ చేపడుతారు అని ప్రశ్నించారు.
ఇక జగనోక్రసి వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్ష నేతను అవమానించే విధంగా మంత్రి మాట్లాడారని ద్వజమెత్తారు. సభలో ఈ తరహా మాటలు సరికాదని ఎమ్మెల్యే నెహ్రూ హితవు పలికారు. తమ అధినేతకు అధికార పక్షం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల మద్దతుతో ఎన్నికైన సభ్యులం తప్ప.., దొడ్డిదారిలో మంత్రి పదవులు పొందలేదని నేరుగా యనమలను ఉద్దేశించి మాట్లాడారు. దీంతో టిడిపి సభ్యులు కూడా నిరసన తెలిపారు. రెండు పార్టీల నిరసనలతో గందరగోళం నెలకొనటంతో సభ పదిహేను నిమిషాలు వాయిదా పడింది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more