ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూసేకరణ చట్టం ప్రతిబంధకమౌతోంది- ఆర్థిక పరంగా.
జనవరి 1 నుంచి అమలులోకి వచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు అంతకుముందు చేసినట్లుగా అత్యవసర పరిస్థితి లేదా అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా రైతులు, ఇతర వ్యక్తుల దగ్గర్నుంచి భూమిని తీసేసుకోవటానికి వీల్లేదు.
భూసేకరణ చెయ్యదలచుకున్న ప్రాంతంలో దానివలన కలిగే సామాజిక ప్రభావాన్ని ముందుగా అంచనా వెయ్యాలి. అందుకు గాను ఆ ప్రాంతానికి చెందిన పంచయతీ లేదా మున్సిపాలిటీ అనుమతి తీసుకోవటం తప్పనిసరి. భూసేకరణ చెయ్యవలసిన అవసరాన్ని నిర్ధారించాలి. భూసేకరణ వలన ప్రయోజనం, హేతుబద్ధతను నిర్ణయించాలి. సేకరించవలసిన భూమి ఆ పని కోసం అంత అవసరమా అన్నది నిర్ణయించాలి. ఆ ప్రయోజనానికి అంత ప్రభుత్వ భూమి అందుబాటులో లేదా అన్నది చూడాలి. మనది వ్యవసాయాధారిత దేశం కాబట్టి వ్యవసాయంలో ఉన్న భూమిని సేకరించగూడదు. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో అలా చెయ్యవలసి వచ్చినట్లయితే ఆ వ్యవసాయదారులకు ప్రత్యామ్నాయంగా మరోచోట సాగు భూమినే కేటాయించవలసివస్తుంది. అలాగే నివాస యోగ్యమైన భూమిని ఇళ్ళ స్థలాలు కోల్పోయినవారికి చూపించాలి. ఇళ్ళు కోల్పోయినట్లయితే ఇళ్ళు కట్టించి ఇవ్వాలి. ఖాళీ స్థలాలకు సేల్ డీడ్ లో ఉన్న మొత్తానికి ఒకటిన్నర రెట్లు కానీ, లేదా మార్కెట్ విలువలో కాని చెల్లించాలి.
భూసేకరణను ప్రజాహితంలో చేస్తున్నట్లయితే దాని వలన ఎంతమంది భూమిని కోల్పోతున్నారు, అందుకు ఎంత పరిహారాన్ని చెల్లించాలి అన్న లెక్కలు వేసుకోవాలి. నివేదికను తయారు చేసే కమిటీలో గ్రామసభ ప్రతినిధులు, సామాజిక శాస్త్రవేత్తలు, పునరావాస నిపుణులు, సాంకేతిక నిపుణులు ఉంటారు.
పరిహారాన్ని చెల్లించటానికి కూడా ఒక సంవత్సరం సమయమే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. నోటిఫికేషన్ ఇచ్చిన రోజునుంచి పూర్తి పరిహారం చెల్లించేవరకు 12 శాతం వడ్డీ చెల్లించాలి.
భూసేకరణ చట్టాన్ని సడలిస్తేనే రాజధాని!
ఇలా ఇంకా ఎన్నో ఆంక్షలతో కూడుకున్న భూసేకరణ చట్టం తో భూసేకరణ అసాధ్యమైన పనిగానే మిగిలిపోతోంది. అందువలన ఆ చట్టంలో కొన్ని సడలింపులు, కొన్ని మినహాయింపులకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more