Speaker sumitra mahajan urges mps

Parliament, Lok Sabha, Rajya Sabha, India, Politics, Parliament, Budget, Budget 2014, Budget session, BJP, Congress, Narendra Modi, Sumitra Mahajan

Speaker Sumitra Mahajan urges MPs.

స్పీకరమ్మకు చిర్రెత్తుకొచ్చింది

Posted: 07/09/2014 07:04 PM IST
Speaker sumitra mahajan urges mps

పార్లమెంటు, అసెంబ్లీలలో అధికార పక్షం వారి నిర్ణయాల పై ప్రతి పక్షం వారు నిరసనలు తెలపడం, ప్లకార్డులు ప్రదర్శించడం చేస్తూ సభను సజావుగా సాగకుండా చేస్తారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్పడానికి. కొన్ని సందర్భల్లో అవి శృతి మించి పోయి మైకులు, కుర్చీలు విరగ్గొస్తుంటారు. ఇలాంటి సంఘటనలు జరగడం సర్వ సాధారణమే అని ప్రజలు కూడా లైట్ తీసుకున్నారు.

కానీ మోదీ ప్రభుత్వంలో స్పీకర్ గా ఎన్నికైన సుమిత్రా మహాజన్ మాత్రం లోక్ సభ సభ్యులకు సభలో ఎలా ఉండాలో క్లాస్ పీకారు. సభలో మర్యాదపూర్వకంగా, హుందాగా ప్రవర్తించాలని ఆమె సభ్యులకు సూచించారు. లోక్ సభ సభ్యుల ప్రవర్తన ఏ మాత్రం బాగోలేదని, దేశమంతా మనని చూస్తున్నారని ఆమె ఈ సందర్భంగా సభ్యులకు చెప్పారు. ఏ పార్టీ సభ్యులు కూడా సభలోకి ప్లకార్డులు తీసుకురావద్దని, వెల్ లోకి రావద్దని సుమిత్రా మహాజన్ చెప్పారు.

తమ తమ స్థానాల్లోనే ఉండి నిరసన తెలపాలని ఆమె పేర్కొన్నారు. సుమిత్రమ్మ టీచర్ లా పీకిన క్లాసును సభ్యులందరు క్లాసులో పిల్లల్లాగ విన్నారు కానీ, క్లాస్ రూంలో పిల్లల్ని భయపెట్టినంత సేపే బుద్దిగా ఎలా ఉంటారో, మన ఎంపీలు కూడా అప్పటి వరకు ఆమె చెప్పిన మాట విన్నారు. రేపటి నుండి అల్లరి చేయకుండా బుద్దిగా ఉంటారో లేదో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles