(Image source from: Cm kcr orders to take over empty lands to build IT companies which are not yet used)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం తన దూకుడును రోజురోజుకు పెంచుకుంటూ వస్తున్నారు. తాజాగా పరిశ్రమల అభివృద్ధి గురించి ప్రసంగించిన కేసీఆర్... అందుకు అవసరమయ్యే భూముల కేటాయింపు విషయంలో ప్రణాళికలను సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా వున్నప్పుడు అప్పట్లో పరిశ్రమలు స్థాపించాలని కేటాయించిన భూములలో ఇప్పటికీ కొన్ని ప్రారంభించలేదు. మరికొన్ని అర్థాంతరంగా మధ్యలోనే నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్... ‘‘గతంలో పరిశ్రమల స్థాపనకు తీసుకున్న భూముల్లో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకుంటే వెంటనే వాటిని స్వాధీనం చేసుకోండి’’ అని ఆదేశించినట్టు తెలిపారు. అలాగే ఏ చాలాచోట్ల పరిశ్రమలు స్థాపించకుండా ఖాళీగా వదిలేసిన భూములపై త్వరగా చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పారు. ఒకవేళ ఖాళీగా వున్న భూములు వ్యవసాయానికి పనికిరాకపోతే వాటిలో భారీ పరిశ్రమలను స్థాపించేలా ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు.
శుక్రవారంనాడు సీఎం కేసీఆర్ సచివాలయంలోని తన కార్యాలయంలో నూతన పారిశ్రామిక విధాన రూపకల్పనపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమాజంలో అన్ని వర్గాలకు సమానంగా భాగస్వామ్యం కలిగించే విధంగా... జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించే విధంగా రూపొందించాలని మంత్రులతో పేర్కొన్నారు. అవసరమైతే పారిశ్రామికవేత్తలు, సంఘాల ప్రతినిధులతో ఒక సదస్సును నిర్వహించి.. పారిశ్రామిక ఏర్పాట్లకు సంబంధించి అన్ని సలహాలను తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రస్తుతం వున్న లోటుపాట్లన్నింటిని సవరించి, మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు.
తెలంగాన రాష్ట్రంలో వుండే అన్ని వనరులను సద్వినియోగం చేసుకునే విధంగా కాలుష్యరహితమైన పరిశ్రమలను స్థాపించి, వాటిని అవసరమైనంత మేర విద్యుత్ ను అందేలా ప్రతిపాదనలు వుండాలని అన్నారు. తెలంగాణాలో వున్న నిరుద్యోగస్తులందరికీ ఉద్యోగవకాశాలు కల్పించే విధంగా అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి ఒక ప్రత్యేక విధానాన్ని అమలు చేయాలని... అలాగే పంచవర్ష ప్రణాళిక వంటి సిద్ధాంతాలను రూపొందించాలని ఆదేశించారు.
తమిళనాడు రాష్ట్రంలో తిరువూరు ప్రాంతం వుండేవిధంగా తెలంగాణను కూడా ఒక జౌళి మండలంగా రూపుదిద్దుకునేలా ఔళి పార్కులను ఏర్పాటు చేసే ప్రణాళికలను సిద్ధం చేయమని ఆదేశించారు. అందులో ముఖ్యంగా ఈ పార్కును నిర్మించడానికి వరంగల్ ప్రాంతం అనువైనదని.. అక్కడున్న అజాంజాహి భూముల్లో పార్కులను ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలోనూ ఔళి పార్కును అభివృద్ధి చేయాలన్నారు. ఇలా ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని తన తోటి మంత్రులతో ఆదేశాలు జారీ చేసినట్లు తాజా సమాచారం!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more