ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణా ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణా ఆవిర్భావం తెలంగాణా ప్రజలందరిదీ కాబట్టి తెలంగాణాలో ప్రతిపక్షంగా నిలిచిన తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి ఆ తర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణా శాఖ అధ్యక్షుడు ఎల్ రమణ, ఇంకా తెదేపా నాయకులు ఎర్రబల్లి దయాకర రావు, కొత్తకోట దయాకర రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణా ప్రజలకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేసారు.
అదే విధంగా కాంగ్రస్ పార్టీ నాయకులు గాంధీభవన్ లో తెలంగాణా ఆవిర్భవించిన సందర్భంగా వేడుకలు చేసుకున్నారు. పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జాతీయ జెండాను ఎగురవేసి, బంగారు తెలంగాణా కోసం కృషి చేస్తామని మాటిచ్చారు. అడ్డంకులన్నిటినీ ఎదుర్కుంటూ సోనియా గాంధీ తెలంగాణాను తెచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసారు.
భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కూడా తెలంగాణా ఆవిర్భావ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను ఎగురవేసిన భాజపా తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెలంగాణా అభివృద్ధికి అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.
బంజారా హిల్స్ లోని లోక్ సత్తా పార్టీ కార్యాలయంలో తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ జాతీయ జెండా, పార్టీ జెండాలను ఆవిష్కరించి జరిపించారు. భౌగోళికంగా విడిపోయినా ఇరు ప్రాంతం వారు సామరస్యంతో మెలుగుతూ వర్థిల్లాలని ఆకాంక్షించారాయన. తెలంగాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణా రాష్ట్ర సమితి ఆ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మసులుకుంటుందన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తంచేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more