ఆదివారం తెలంగాణా భవన్ లో కొత్తవాళ్ళని పార్టీకి చేర్చుకున్న సందర్భంగా మాట్లాడిన తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కాంగ్రెస్ పార్టీని ఎండగట్టారు.
మనం చూడని పార్టీలా, కడుపులో చల్ల కదలకుండా ఉన్నోళ్ళు ఉద్యమకారులు, రోడ్ల మీద తన్నులు తిన్నోళ్ళం పనికిరానోళ్ళమా, అధికారంలో ఉన్నప్పుడేం వెలగబెట్టింరు అంటూ కెసిఆర్ కాంగ్రెస్ తప్పిదాలను ఏకరువు పెట్టారు. తెరాస కోరుకునేది తెలంగాణా ప్రజల ఆనందమైతే కాంగ్రెస్, తెదేపాలు కార్చేవి మొసలి కన్నీళ్ళన్నారాయన. మేకవన్నె పులులైన ఆ పార్టీలను గెలిపిస్తే గోసపడతం కాబట్టి తెరాసను గెలిపించండి అన్నారు కెసిఆర్.
ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెరాస వలనే తెలంగాణా సాధ్యమైందని, అందువలన ఆ పార్టీని గెలిపించి రాష్ట్ర పునర్నిర్మాణంలో చేయూత నీయమని కెసిఆర్ పిలుపునిచ్చారు. తన సేవా దృక్పథాన్ని చాటుతూ కెసిఆర్, మీ కాలికి ముల్లు గుచ్చితే నా పంటితో తీసేస్తా అన్న కేసిఆర్, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ, వాళ్ళని నమ్మితే పంటికి అందకుండా మింగేస్తరు, సిఎం పదవి కోసం నాకంటే నాకని కొట్లాడతరు అన్నారు కెసిఆర్.
పార్టీలో కొత్తగా చేరినవారు, కల్వకుర్తి ఎమ్మెల్యే తెదేపా నాయకుడు జైపాల్ యాదవ్, టిజిఓ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, తెలంగాణా ధూంధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్.
శ్రీనివాస గౌడ్ ని ఎంత సత్కరించినా తక్కువేనని, ఎందరు ఎన్ని రకాలుగా వేధించినా పెన్ డౌన్ దగ్గర్నుంచి సకలజనుల సమ్మె వరకు సింహంలా పోరాడారని, తనకు కుడిభుజంగా నిలిచారని పొగుడ్తూ, ఆయన ఎన్నికలలో నిలబడాలన్నది ప్రజలే డిమాండేనని, అందువలన తనే ఆయనను పార్టీలోకి రమ్మని ఆహ్వానించానని కెసిఆర్ అన్నారు. అలాగే రసమయి బాలకిషన్ తన పాటలతో ఉద్యమకారులను ఉర్రూతలూగించారని, ఆయనను కూడా తాను రాజకీయాలలోకి రమ్మని ఆహ్వానించానని ఆయన అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more