భారతీయ జనతాపార్టీలో కార్యకర్తగా మొదలుపెట్టి అంచలంచలుగా జాతీయస్థాయికి ఎదిగిన దళిత నాయకుడు బంగారు లక్ష్మణ్ (74) శనివారం సాయంత్రం 5.15 కి కన్నుమూసారు. గుండెకు సంబంధించిన వ్యాధులతో చాలాకాలంగా బాధపడుతున్న బంగారు లక్ష్మణ్ నెలరోజుల నుంచి సికింద్రాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ, వివిధ అవయవాల లోపంతో మరణించారు.
ఆయన మరణ వార్త వినగానే భాజపా నాయకులు విద్యా సాగరరావు, బద్దం బాలిరెడ్డి ఇంకా ఎందరో భాజపా నాయకులు, కార్యకర్తలు హాస్పిటల్ కి తరలి వెళ్ళి అశ్రునయనాలతో అమరజీవికి నినాదాలు చేసారు.
మార్చి 17, 1939 న జన్మించిన బంగారు లక్ష్మణ్ 1953లో 12 సంవత్సరాల వయసులోనే ఆర్ఎస్ఎస్ లో చేరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ, అనంతరం లా డిగ్రీ చదివిన బంగారు లక్ష్మణ్ విద్యుత్ రైల్వే శాఖలలో పని చేసారు. 1969 లో ఆయన ఉద్యోగాలకు స్వస్థి చెప్పి రాజకీయాలలో అడుగుపెట్టారు. ఆర్ఎస్ఎస్ లో వివిధ బాధ్యతలను నిర్వహించి ట్రేడే యూనియన్లలో కార్మికుల తరఫున పోరాటాలు సాగించారు. ఉద్యమాలలో పలుమార్లు జైలుకి వెళ్ళారాయన. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసారు. 1985-86 లో రాష్ట్ర శాసన మండలికి, 1996 లో గుజరాత్ నుండి రాజ్యసభకు ఎంపీగానూ ఎన్నికయ్యారు. 2000 లో బంగారు లక్ష్మణ్ భాజపా తొలి దళిత జాతీయ అధ్యక్షుడిగా తెలుగు రాష్ట్రానికి, దళితులకు పేరు తెచ్చారు.
అయితే సుదీర్ఘకాలం దళితుల కోసం, కార్మికుల కోసం, పార్టీ కోసం పనిచేసిన ఆయన జీవితంలో జరిగిన అపశృతి సైన్యానికి చేసిన పరికరాల కోనుగోళ్ళలో జరిగిన అవకతవకల విషయంలో తెహల్కా చేసిన స్టింగ్ ఆపరేషన్ లో ఆయన పట్టుబడి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అనారోగ్య రీత్యా బెయిల్ మీద చికిత్స పొందుతూ మరణించారు.
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, భాజపా ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ బంగారు లక్ష్మణ్ మృతికి తీవ్ర ఆవేదనను సంతాపాన్ని తెలియజేసారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తెరాస అధ్యక్షుడు కెసిఆర్, తమిళనాడు గవర్నర్ రోశయ్య, మాజీ మంత్రి మాణిక్య వరప్రసాద రావు ఇంకా ఎందరో నాయకులు బంగారు లక్ష్మణ్ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసారు.
భాజపా పార్టీ కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 12.00 గంటల వరకు బంగారు లక్ష్మణ్ పార్ధివ శరీరాన్ని సందర్శనార్థం ఉంచుతారు. ఈ రోజు సాయంత్రం 4.00 గంటలకు పంజాగుట్ట స్మశానవాటికలో జరుగుతున్న బంగారు లక్ష్మణ్ అంతిమ సంస్కారానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్ కిషన్ అద్వాణీ హాజరుకాబోతున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more