జనవరి వచ్చిందంటే చాలు... తల్లిదండ్రులలో ఒకటే హడావుడి మొదలవుతుంది.. తమ పిల్లలను మరింత మంచి స్కూలులో జాయిన్ చేయాలని ఉవ్విళ్ళూరు తుంటారు. ఇదే అదునుగా చేసుకున్న ప్రయివేటు పాఠశాలలు విద్యార్థుల ఫీజులను మరింత రెట్టింపు చేస్తూ తల్లిదండ్రులను హడలెత్తిస్తున్నాయి. . ఈ నేపధ్యంలో త్వరలో ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం లో పలు ప్రైవేటే పాఠశాలు ఇప్పటికీ ఫీజుల పట్టికను సిద్ధం చేస్తున్నాయి.. గత విద్యా సంవత్సరాని కన్నా ఈసారి 30 నుండి 50 శాతం వరకు ఫీజలను రెట్టింపు చేసేందుకు యోచనలు చేస్తున్నాయి.
అయితే ఈ విధంగా ఫీజులు పెంచడానికి కారణం ప్రభుత్వం తరపు నుంచి ప్రైవేటు స్కూళ్లకు తగిన గైడ్ లైన్లు లేక పోవడమే. హైదరాబాద్ నగరంలో సుమారు 6వేల ప్రైవేటు స్కూళ్లు ఉండగా వాటిని ఫీజలు వారీగా చూసుకుంటే మూడు కేటగిరిలలో విభజించవచ్చు. వీటిలో ముందుగా వచ్చేవి కార్పొరేట్ స్కూళ్లు. ఈ పాఠశాలల యాజమాన్యాలు ఏడాడికి ఫీజు కింద ఒక్కో విద్యార్థి నుంచి లక్ష రూపాయల వరకూ వసూలు చేస్తున్నాయి.. ఇక రెండవ కేటగిరీ కింద వచ్చే స్కూళ్లలో 45 వేల నుంచి 50 వేల రూపాయల వరకూ ఫీజల కింద వసూలు చేస్తున్నారు.
అలాగే మూడవ కేటగిరీ కిందకు వచ్చే స్కూళ్లలో ఫీజులు 25 వేలు - 35 వేలుగా ఉన్నాయి. ఈ విధంగా ఫీజుల పెంపును తల్లి దండ్రలు వ్యతిరేకిస్తున్నారు.. స్కూళ్లలో తగిన వసతులు లేకపోయినా, విద్యార్థుల మనో వికాసానికి దోహద పడకపోయినా ఈ విధంగా ప్రైవేటే పాఠ శాలల యాజమాన్యాలు ఫీజుల ను పెంచడం అన్యాయమని వారు గగ్గోలు పెడుతున్నారు.. ప్రభుత్వ పాఠశాలల్లో తగిన విద్యా వసతులు కొరవడిన నేపథ్యంలో తల్లిదండ్రులు మరో గత్యంతరం లేక తమ పిల్లలను ప్రైవేలు పాఠశాలల్లో చదివిస్తున్నారు.. దీనిని ఆసరాగా చేసుకున్న పాఠశాల యాజమాన్యాలు ఫీజులను ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తున్నాయి..
అయితే విద్యాహక్కు చట్టం తెచ్చిన ప్రభుత్వం ఈ విషయంలో కిమ్మనకపోవడం శోచనీయం. ప్రభుత్వం 2008 వ సంవత్సరంలో జారీ చేసిన జిఓ ప్రకారం 12వేల లోపే స్కూలు పీజలు ఉండాలని నిర్దేశించింది.. అయితే ఇది ఈనాటికీ అమలు కాలేదు. ఏది ఏమై నప్పటికీ రాబోయే విద్యాసంవత్సరంలో నైనా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల ఫీజలు పెంపు విషయంలో కఠినంగా వ్యవహరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more