హైద్రాబాద్ లో తన స్వగృహంలో ఉరిపోసుకుని కనిపించిన ఉదయ్ కిరణ్ ని అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు.
జూన్ 26, 1980 లో జన్మించిన ఉదయ్ కిరణ్ సికింద్రాబాద్ వెస్లీ కాలెజ్ లో కామర్స్ లో డిగ్రీ చేసారు. 2000 లో చిత్రం అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమయిన ఉదయ్ కిరణ్ వరుసగా చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే చిత్రాల విజయంతో తెలుగు ప్రేక్షకులకు అభిమాన నటుడయ్యారు.
హీరో అంటే అలా ఉండాలి చూపులకు కానీ నటనకు కానీ అన్నంత పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ 2006 తర్వాత వెండితెరకు కనుమరుగయ్యారు. ఉదయ్ కిరణ్ తమిళంలో నటించిన చిత్రాలకు కూడా ఆయనకు మంచి పేరుని తెచ్చిపెట్టాయి.
ఉదయ్ కిరణ్ మృతికి దిగ్భ్రాంతి చెందిన సినీ పరిశ్రమలోని ప్రముఖులు హుటాహుటిన అపోలో హాస్పిటల్ కి వెళ్ళారు. హాస్పిటల్ లో ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని సందర్శించిన హీరో శ్రీకాంత్ ఈ ఘటనను దర్యాప్తు చెయ్యవలసిందిగా పోలీసులను కోరారు.
వాచ్ మన్ కథనం ప్రకారం ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఆయన భార్య 8.00 గంటలకే ఒక ఫంక్షన్ కి వెళ్ళారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట ప్రాంతంలో ఉదయ్ కిరణ్ అత్తమామలు హడావిడిగా వచ్చిన తర్వాత అరుపులు వినిపించాయి. వెనువెంటనే ఉదయ్ కిరణ్ ను హాస్పిటల్ కి తరలించారు.
బంజారా హిల్స్ ఏసిపి అశోక్ కుమార్ ప్రాధమిక దర్యప్తులో ఉదయ్ కిరణ్ ఉరిపోసుకుని చనిపోయారని, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలియజేసారు. ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదని క్లూస్ టీం అధికారి వెంకన్న తెలియజేసారు. ఉదయ్ కిరణ్ ల్యాప్ టాప్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్న క్లూస్ టీం దర్యాప్తు చేస్తోంది. పోస్ట్ మార్టం తర్వాత వివరాలు ఇంకా తెలుస్తాయని అన్నారు వెంకన్న. ఉదయ్ కిరణ్ ఉరిపోసుకునే ముందు తన భార్యకు ఎస్ ఎమ్ ఎస్ చేసారు. ఆయన సెల్ ఫోన్ ద్వారా ఎవరెవరికి ఫోన్లు చేసారో పరిశీలించి ఆరా తీస్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more