గత ఐదు సంవత్సరాల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఆరుషి, హేమరాజ్ ల జంట హత్యల కేసులో ఘజియాబాద్ సీబీఐ న్యాయస్థానం నిన్న తుది తీర్పును వెలువరించి, నేడు నిందితులకు శిక్షను ఖరారు చేసింది. ఆరుషి, హేమరాజ్ లను హత్య చేసింది దంతవైద్య నిపుణులు రాజేశ్, నూపుర్ తల్వార్ దంపతులేనని సీబీఐ కోర్టు తేల్చింది. 2008 మే 15 రాత్రి జరిగిన ఈ జంట హత్యలను కొంత మంది సహాయంతో ఈ దంపతులే చేసి సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా చేశారని సీబీఐ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు రాజేష్ తల్వార్ కి 18 వేల రూపాయలు, నుపూర్ తల్వార్ కి రూ. 15 వేలు జరిమానా విధిస్తూ యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. దోషులుగా తేలిన రాజేష్ దంపతులకు మరణశిక్ష విధించాలని సీబీఐ వాదించింది. ఇది అత్యంత అరుదైన కేసుగా పేర్కొన్న సీబీఐ... దోషులకు మరణశిక్షే సరైందని వాదనలు వినిపించింది. అయితే శిక్ష తగ్గించాలని తల్వార్ దంపతుల తరుపు న్యాయవాది అభ్యర్థించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు దోషులకు యావజ్జీవ శిక్ష విధించింది. కోర్టు తీర్పు విన్న ఆరుషి తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు.
కాగా తీర్పును హైకోర్టులో సవాల్ చేసేందుకు నూపూర్ తల్వార్ దంపతులు సిద్ధం అవుతున్నారు. కోర్టు వెల్లడించిన తీర్పుకు విరుద్దంగా, సీబీఐ విచారణకు వ్యతిరేకంగా ఆరుషి స్నేహితురాలు ఫిజా ఝా వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ హత్యకేసులో నిజమైన దోషులను శిక్షించినపుడే ఆరుషికి తగిన న్యాయం జరుగుతుంది అని అన్నారు. ఈ హత్యకు సంబంధించి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, పరిస్థితుల డిమాండ్ మేరకే సీబీఐ వ్యవహరించిందని ఫిజా వ్యాఖ్యలు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more