Do not split ap kiran tells antony

Do not split AP, Kiran tells Antony, A.K. Anotny, Andhra Pradesh, Kiran Kumar Reddy, telangana, AICC war room in Delhi

AP CM made a final attempt to convince Cong leadership that AP should not be bifurcated.

విభజన పై మరోసారి పునరాలోచించండి

Posted: 08/21/2013 08:19 AM IST
Do not split ap kiran tells antony

అధిష్టానం పిలుపందుకొని ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ తో పాటు ఆంటోని కమిటీని కలుసుకొని దాదాపు అరగంటకు పైగా వారితో చర్చలు జరిపారు. ఆంటోని కమిటీ ముందు కేంద్రం తీసుకున్న విభజన నిర్ణయం పై ఆయన గట్టిగా మాట్లాడినట్లు తెలుస్తుంది. విభజన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, రాష్ట్రాన్ని విభజిస్తే కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని, రాజధాని నగరం కావటంతో దశాబ్దాలుగా హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అభివృద్ధి కేంద్రీకృతమైనందున సీమాంధ్ర ప్రజలు ఆర్ధికంగా ఇబ్బందులు పడతరాని, అలాగే తెలంగాణకు కూడా పెద్దగా ఉపయోగం ఉండదని ఆయన అబిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని విభజిస్తే జల వివాదాలు తీవ్రమవుతాయని, వర్షాభావ సమయంలో ఈ సమస్య మరింత జఠిలమవుతుందని చెప్పారు. ఈయనే కాకుండా సీమాంధ్ర ప్రాంత నాయకులు కూడా సమైక్యవాదాన్ని చాలా బలంగా వినిపించినట్లు తెలుస్తుంది. ఈ రోజు సోనియాను కలిసిన తరువాతనే ఆయన హైదరాబాద్ తిరిగి వస్తారని తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles