దేశంలో ఎక్కడా లేని విధంగా వస్త్ర వ్యాపారాలపై 5 శాతం వ్యాట్ ( వేల్యూ యాడెడ్ టాక్స్) విధించడాన్ని నిరసిస్తూ గత కొన్ని వారాలుగా రాష్ట్ర వ్యాప్తంగా వస్త్ర వ్యాపారులు చేస్తున్న నిరసనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ను పూర్తి గా రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉన్నాయని, వీటికి అదనంగా వ్యాట్ ను కూడా విధించడంతో చిన్నస్ధాయి నుంచి భారీ స్ధాయి వ్యాపారాలు సైతం నష్టాల ఊబిలోకి పడిపోయాయని వస్త్ర వ్యాపారులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను కూడా చేయడం జరిగింది. అయితే ఇతర రాజకీయ పార్టీల హామీలకు ధీటైన సమాధానం ఇవ్వాలన్న మంత్రి వర్గ ఉప సంఘం, అధికార కాంగ్రెస్ పార్టీ క్యాడర్ సూచనల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్త్ర వ్యాపారులకు వ్యాట్ నుంచి మినహాయింపు చేశారు. టిడిపి సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఏదో ఒక సంచలన ఆరోపణ చేస్తుంటారు. వస్త్రాలపై వ్యాట్ ఎత్తివేయాలని గత కొంతకాలంగా ఆందోళన జరుగుతోంది. ఈ డిమాండ్ కు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సిద్దమైంది. అయితే గాలి ముద్దు కృష్ణమనాయుడు వస్త్ర వ్యాపారుల వద్ద ఏభై కోట్ల ముడుపులు తీసుకుని వ్యాట్ ఎత్తివేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సోదరులు సంతోష్, కిషోర్ లు సెటిల్ మెంట్లు చేస్తున్నారని కూడా ఆరోపించారు. ఎర్రచందనం వ్యవహారంలో 500 కోట్ల గోల్ మాల్ జరిగిందని కూడా ఆయన అంటున్నారు. మొత్తం మీద గాలి ముద్దు చేసే ఆరోపణలలో ఎంతవరకు వాస్తవం ఉంటుందో తెలియదు కాని, అవి కాస్త సంచలనంగానే ఉంటాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more