మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జరిగిన వివిధ చోట్ల పలు రకాలు హత్యలు జరిగాయి. వాటన్నింటిని కలిసి సండే క్రైం స్టోరీస్ కింద మీకు అందిస్తున్నాం. వాటి వివరాలు. కడప జిల్లాలోని దువ్వూరు మండంలోని పుల్లారెడ్డి పేట బైపార్ రోడ్డు వద్ద ఆ జిల్లాకు చెందిన మాలమహానాడు నేత, జిల్లా కన్వీనర్ అయిన అయిన సాగర్ ని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని కేపు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే సాగర్ పై ఎవరు ఎందుకు దాడి చేసి హత్య చేశారనిది మాత్రం ఖచ్చితంగా తెలియదని, పాత కక్ష్యలే కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని వి.కోట మండలం కాజుపేటలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. హతుడిని నాసిర్ గా గ్రామస్తులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్ లోని మేడ్చల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వృద్ధ దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరీశీలించి, హత్యకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో అనుమానం ఉన్న వ్యక్తుల దగ్గర నుండి ఆధారాలు సేకరిస్తున్నారు.
హైదరాబాద్ లోని పాతబస్తీలోని ఉప్పుగూడ ప్రాంతంలో ఉన్న మహాంకాళి అమ్మవారి ఆలయంలో రాత్రి చోరీ జరిగింది. ఈ చోరీలో దుండగలు భారీ సొమ్మును దోచుకెళ్ళారు. 5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, అమ్మవారి ముక్కుబుడక, పుస్తెలు, నాగపడగ, హుండీని దొంగిలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి, దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో లారీ - కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో ఐదురుగు గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరణించిన ఇద్దరు కూడా భవానీ మాల ధరించిన భక్తులు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అమెరికాలోని పెన్సిల్వేనియా ప్రాంతంలో చిన్నారి సాన్వి, నాయనమ్మ సత్యవతిలను యండమూరి రఘునందన్ అనే యువకుడు డబ్బు కోసం హత్యలు చేసిన విషయం తెలిసిందే. హత్యకు గురైన సత్యవతి మృతదేహంను ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలోని స్వగ్రామం కుడుములకుంట్లకు తరలించారు. ఈమె అంత్యక్రియలు ఈ రోజు జరుగుతాయని ఆమె బంధువులు తెలిపారు. సత్యవతి మృతదేహం అక్కడికి రావడంతో అక్కడి ప్రాంతం శోక సముద్రంలో మునిగింది. రఘనందన్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more