విచారణ పేరుతో సిబిఐ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి వేధించిందని ఎమ్మార్ కేసులో అరెస్టైన విజయ రాఘవన్ ప్రత్యేక కోర్టులో తెలిపారు. విజయ రాఘవన్ను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా సిబిఐ కోర్టును కోరిన నేపథ్యంలో దీనిని విచారించారు. ఈ సందర్భంగా విజయ రాఘవన్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. గత ఐదున్నర నెలలుగా సిబిఐ రాఘవన్ను విచారణ పేరుతో వేధిస్తోందని అన్నారు. రాఘవన్ ఇప్పటికే తనకు తెలిసిన సమాచారమంతా అందజేశారని, ఇక రిమాండులు, అరెస్టులు అవసరం లేదన్నారు. సిబిఐ విచారణ పేరుతో ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందన్నారు. ఆయనను మానసికంగా కూడా వేధిస్తున్నారన్నారు. తాము చెప్పింది చేయకపోవడంతోనే సిబిఐ రాఘవన్ను అరెస్టు చేసిందన్నారు. ఆయనను చిత్రహింసలు పెట్టిందన్నారు.
గాయాలపాలై ట్రీట్ మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆయనను చిత్రహింసలు పెట్టిన విజువల్స్ చూపించి విల్లాల ఓనర్లను సిబిఐ బెదిరింపులకు గురి చేస్తోందన్నారు. సిబిఐ చేసిన గాయాలు ఆయన ఒంటిపై ఇప్పటికీ ఉన్నాయని అన్నారు. కాగా విచారణ పేరుతో సిబిఐ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని రాఘవన్ చెప్పడం కేసులో కీలక మలుపుగా చెప్పవచ్చు. దీంతో కేసు మలుపు తిరుగుతుందో చూడాలి. రాఘవన్ను సిబిఐ పలుమార్లు విచారించింది. వేధింపులకు సంబంధించిన రిపోర్టులు ఇవ్వడానికి సిద్ధమని రాఘవన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
కాగా స్టైలిష్ హోం రంగారావుకు ముందస్తు బెయిల్ ఇవ్వడంపై సిబిఐ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. సునీల్ రెడ్డి తరఫు న్యాయవాది మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సిబిఐ, నిందితులతో కుమ్మక్కయ్యారని అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వడంపై అభ్యంతరం చెప్పడం లేదన్నారు. కాగా రంగారావు బెయిల్ విచారణపై ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more