ఈరోజు వసంత పంచమి సందర్భంగా నిజామాబాద్ జిల్లా బాసరలో అత్యంత వైభవంగా సరస్వతీ అమ్మవారికి సేవలు చేస్తున్నారు. సరస్వతీదేవి జన్మదిన మైన వసంత పంచమి నాడు ఆమె కృపకు పాత్రులవుదామని, తమ చిన్నారుల అక్షరాభ్యాసం చేయిద్దామని, అమ్మవారి సేవలో పాల్గొందామని, ఈ రోజు నిర్వహించే ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను వీక్షిద్దామని వచ్చే జనసందోహం సౌకర్యార్థం ప్రత్యేకమైన బస్సులు, వైద్య బృందాలు, త్రాగునీరు, టెంట్లతో తాత్కాలిక వసతులు, అదనపు పోలీసు బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేసారు.
ఆంధ్రా, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ ఆలయానికి తెలుగు వారే కాకుండా మరాఠీ భక్తులు కూడా నిత్యం వచ్చి దర్శనం చేసుకుంటుంటారు. ఈ ఆలయంలో అక్షరాభ్యాసం చేస్తే చదువు బాగా అబ్బుతుందని, విద్యార్థుల ఇక్కడ దీక్ష చేస్తే వారి వారి చదువుల్లో బాగా రాణిస్తారని, పెద్దవాళ్ళు కూడా పాండిత్యంకోసం, ప్రావీణ్యం కోసం, చక్కటి ఆలోచనలు, మనోస్థైర్యం కలగటం కోసం ఇక్కడికి వచ్చి, 3 రోజుల నుంచి 40 రోజుల దీక్షలు చేస్తారు. అలాంటివారికోసం ప్రత్యేకంగా నిర్మాణం చేసిన మండపంలో ఆలయ యాజమాన్య అనుమతితో ఉచితంగా ఉండవచ్చును.
విద్య, పాండిత్యమున్నచోట ధనం ఉండదనే ఒక నమ్మకం ఉంది. అందుకే కాబోలు ఈ ఆలయంలో సరస్వతీ దేవి పక్కనే లక్ష్మీ దేవి విగ్రహం కూడా ప్రతిష్టించబడింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more