అవినీతి పై అన్నా హజారే చేస్తున్న ఉద్యమానికి కొంత ప్రతిఫలం లభించింది. పార్లమెంట్ లో ‘లోక్ పాల్’ బిల్లు ప్రవేశపెట్టాలని అన్నా హజారే చేస్తున్న డిమాండ్ ను సూత్ర ప్రాయంగా అంగీకరిస్తూ కేంద్రం తనకు అనుకూలంగా తయారు చేయించుకున్న బిల్లును రేపు లోక్ సభలో ప్రవేశపెట్టనుంది. ఈ లుకలుకల లోక్పాల్పై ప్రభుత్వం ఎట్టకేలకు ఓ నిర్ణయానికి రాగలిగింది. ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం.. లోక్పాల్లో తొమ్మిదిమంది సభ్యులుంటారు. చైర్మన్ను నలుగురు సభ్యుల కమిటీ ఎన్నుకుంటుంది. ఈ కమిటీలో ప్రధాని, లోక్సభ స్పీకర్, లోక్సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా.. సుప్రీంకోర్టు జడ్జీల నుంచి ఆయన నామినేట్ చేసిన వ్యక్తి ఉంటారు. ప్రధానమంత్రిని కూడా లోక్పాల్ పరిధిలోకి తెస్తున్న ఈ బిల్లు.. ఆయనకు పలు రంగాల్లో రక్షణలు కల్పించింది. లోక్పాల్ వ్యవస్థకు రాజ్యాంగ బద్ధ హోదాను కూడా కల్పించింది.
సీబీఐని లోక్పాల్ పరిధిలోకి తేవాల్సిందేనని అన్నా హజారే బృందం గట్టిగా పట్టుబట్టినా, ప్రభుత్వం మాత్రం అందుకు తలొగ్గలేదు. ప్రభుత్వ ప్రతిపాదనలపై అన్నా బృందం భగ్గుమంది. ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు నిరాహార దీక్ష, 30వ తేదీ నుంచి జైల్భరో ఉద్యమాలు చేపట్టనున్నట్లు అన్నా హజారే ప్రకటించారు. తర్వాత 30 నుంచి జైల్భరో ఉద్యమం మొదలుపెడతానని తన స్వగ్రామం రాలెగావ్సిద్ధిలో ప్రకటించారు.
బిల్లును ప్రవేశపెట్టేందుకు వీలుగా పార్లమెంటు సమావేశాలను ఈనెల 27 నుంచి 29 వరకు పొడిగించాలని తొలుత తలపెట్టినా, తర్వాత ఎంపీలు క్రిస్మస్ సెలవుల తర్వాత పార్లమెంటుకు రావడానికి విముఖత చూపించడంతో 22నే బిల్లు ప్రవేశపెట్టాలని సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more