ప్రత్యేక రాష్ట్రం కోసం పదవులను వదిలి పెట్టకుండా తనదైన శైలిలో పోరాడుతూ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు సహనం నశించినట్లు ఉంది. ఇన్ని రోజులు ఓపికతో అమ్మకే వంతన పాడుకుంటూ వచ్చారు. ఏమైందో ఏమోకానీ ఒక్కసారిగా అమ్మపైనే ధిక్కార స్వరం వినిపించారు. ధిక్కార స్వరమే కాకుండా ఏకంగా హెచ్చరించే స్థాయికి వెళ్ళారు.
తాజాగా ప్రత్యేక రాష్ట్రం కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తున్నారని వస్తున్న వార్తల పై వీరు స్పందించారు. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కాకుండా అభివృద్ధి మండలి, ప్యాకేజీ లాంటివి ప్రకటిస్తే తీవ్ర పర్యవసానాలుంటాయని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు.. అధ్యక్షురాలు సోనియాగాంధీని హెచ్చరిస్తూ తనదైన శైలిలో వాక్బాణాలు సందిస్తూ లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రస్తుతం.. తుఫాను ముందు ప్రశాంతత లాంటిదే నెలకొన్నదని, తగిన నిర్ణయం తీసుకోకపోతే తుఫాను రాక తప్పదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు
ఇన్ని రోజులు అమ్మ సలహా మేరకే, ఆమె పై ఉన్న నమ్మకంతోనే సభాకార్యకలాపాలు అడ్డుకోకుండా కేవలం ఆమె దృష్టిని ఆకర్షించేందుకు లాంఛనంగా నిరసనలు తెలుపుతున్నామని, అంత మాత్రాన మీరు మమ్మల్ని తక్కువగా చూస్తూ వీరు ఇంతే అన్నట్లు వ్యవహరిస్తున్నారని, అంత మాత్రాన మాలో తెలంగాణ భావం తగ్గిపోయినట్లు కాదని వారు స్పష్టం చేశారు. తెలంగాణకోసం ఎంత ఉద్యమిస్తున్నా, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు పార్టీకోసం నిలబడ్డారన్న విషయాన్ని ప్రశంసించాలని సోనియాకు తెలిపారు. డిసెంబర్ 9న హోం మంత్రి ప్రకటనను తాను అంగీకరించలేదని రోశయ్య చెప్పడం, కిరణ్ సర్కార్ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను అరెస్టు చేయడం, వందలాది విద్యార్థులను జైలు పాలు చేయడం, కాంగ్రెస్తో పాటు నాలుగు పార్టీలు తెలంగాణపై తమ అభిప్రాయం చెప్పలేదని హోంమంత్రి చిదంబరం చెప్పడంతోనే తాము పార్లమెంట్లో నిరసన తెలుపాల్సి వచ్చిందని టీ ఎంపీలు సోనియా దృష్టికి తీసుకువచ్చారు. మరి ఈ లేఖ పై అమ్మ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ప్రత్యేక రాష్ట్రం కోసం పదవులను వదిలి పెట్టకుండా తనదైన శైలిలో పోరాడుతూ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు సహనం నశించినట్లు ఉంది. ఇన్ని రోజులు ఓపికతో అమ్మకే వంతన పాడుకుంటూ వచ్చారు. ఏమైందో ఏమోకానీ ఒక్కసారిగా అమ్మపైనే ధిక్కార స్వరం వినిపించారు. ధిక్కార స్వరమే కాకుండా ఏకంగా హెచ్చరించే స్థాయికి వెళ్ళారు.
తాజాగా ప్రత్యేక రాష్ట్రం కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తున్నారని వస్తున్న వార్తల పై వీరు స్పందించారు. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కాకుండా అభివృద్ధి మండలి, ప్యాకేజీ లాంటివి ప్రకటిస్తే తీవ్ర పర్యవసానాలుంటాయని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు.. అధ్యక్షురాలు సోనియాగాంధీని హెచ్చరిస్తూ తనదైన శైలిలో వాక్బాణాలు సందిస్తూ లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రస్తుతం.. తుఫాను ముందు ప్రశాంతత లాంటిదే నెలకొన్నదని, తగిన నిర్ణయం తీసుకోకపోతే తుఫాను రాక తప్పదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు
ఇన్ని రోజులు అమ్మ సలహా మేరకే, ఆమె పై ఉన్న నమ్మకంతోనే సభాకార్యకలాపాలు అడ్డుకోకుండా కేవలం ఆమె దృష్టిని ఆకర్షించేందుకు లాంఛనంగా నిరసనలు తెలుపుతున్నామని, అంత మాత్రాన మీరు మమ్మల్ని తక్కువగా చూస్తూ వీరు ఇంతే అన్నట్లు వ్యవహరిస్తున్నారని, అంత మాత్రాన మాలో తెలంగాణ భావం తగ్గిపోయినట్లు కాదని వారు స్పష్టం చేశారు. తెలంగాణకోసం ఎంత ఉద్యమిస్తున్నా, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు పార్టీకోసం నిలబడ్డారన్న విషయాన్ని ప్రశంసించాలని సోనియాకు తెలిపారు. డిసెంబర్ 9న హోం మంత్రి ప్రకటనను తాను అంగీకరించలేదని రోశయ్య చెప్పడం, కిరణ్ సర్కార్ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను అరెస్టు చేయడం, వందలాది విద్యార్థులను జైలు పాలు చేయడం, కాంగ్రెస్తో పాటు నాలుగు పార్టీలు తెలంగాణపై తమ అభిప్రాయం చెప్పలేదని హోంమంత్రి చిదంబరం చెప్పడంతోనే తాము పార్లమెంట్లో నిరసన తెలుపాల్సి వచ్చిందని టీ ఎంపీలు సోనియా దృష్టికి తీసుకువచ్చారు. మరి ఈ లేఖ పై అమ్మ ఎలా స్పందిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more