జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్ కర్ రాణా హత్యకేసులో అభియోగాలు ఎదుర్కొంటూ రిమాండులో వున్న రెజ్లర్ సుశీల్ కుమార్ నలుగురు మిత్రలను పోలీసులు అరెస్టు చేశారు. సాగర్ రాణా హత్యకేసులో వీరి పాత్ర కూడా వుందని నిర్ధారించుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. వీరందరినీ ఢిల్లీలోని ఖంఝవాలా ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని భూపేందర్ అలియాస్ భూపీ, మొహిత్ అలియాస్ భోలి, గులాబ్ అలియాస్ ఫహిల్వాన్, మజీత్ అలియాస్ చున్నీల్ లాల్ గా గుర్తించారు. వీరంతా హర్యానాకు చెందిన వారని పోలీసులు తెలిపారు.
సాగర్ రాణా హత్యకేసులో సుశీల్ కుమార్ కు సహకరించిన ఈ నలుగురు కాలా అసుదా- నీరజ్ భవానా గ్యాంగ్ యాక్టివ్ సభ్యులని పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగస్టర్ల ప్రమేయం వున్నట్లు సమాచారం అందడంతో హర్యానాలోని రోహిణి జిల్లాలోని గేవ్ర రైల్వే క్రాసింగ్ వద్ద తమ స్పెషల్ పోలీసుల బృందం నిఘా పెట్టిందని, వారిని ఓ రహస్య ఇన్ ఫార్మర్ తో గుర్తించిన వెంటనే అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించామని పోలీసులు తెలిపారు. వీరిపై పలు కేసుల్లో నాన్ బెయిలెబుల్ వారెంట్లు కూడా వున్నాయన్నారు.
అయితే వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తే జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్యకేసులో వున్న కుట్రకోణం మొత్తం బట్టబయలు అయ్యిందని తెలిపారు. అసలేం జరిగింది.. హత్యకు దారి తీసిన కారణాలేంటి అన్న విషయాలు వరుస క్రమంలో వారు తెలిపారని పోలీసులు చెప్పారు. మే 4వ తేదిన ఛత్త్రాసాల్ స్టేడియంలో జరిగిన ఘటనను కళ్లకు కట్టినట్టు చెప్పారని, అంతేకాకుండా సాగర్ రాణా హత్యకేసులో నిమగ్నమైన ఇతర వ్యక్తుల పేర్లను కూడా వెల్లడించారని పోలీసులు తెలిపారు. చత్త్రాసాల్ స్టేడియంలో రెజర్ల మధ్య ఘర్షణ జరిగిందని, పలువురికి గాయాలయ్యాయని అందులో ఒకరు చికిత్స పోందుతూ మరణించారని పోలీసులు తెలిపారు.
ఇదిలావుండగా, రెజ్లర్ సుశీల్ కుమార్ పోలీసుల దర్యాప్తుకు సహకరించడం లేదని, వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం లేదని.. పోలీసులు పదేపదే అడిగినా పెదవి విప్పడం లేదని సమాచారం. గ్యాంగ్ స్టర్లతో ఆయనకున్న సంబంధాల కోణంలోనూ సుశీల్ పై విచారణ సాగుతోంది. న్యాయస్థానం ఇచ్చిన ఆరు రోజుల కస్టడీని వినియోగించుకోవాలని పోలీసుల ప్రయత్నాలకు సుశీల్ మౌనం అటంకంగా మారినట్లు తెలుస్తోంది. కాగా సుశీల్ కుమార్ సోమవారం రాత్రంతా విలపిస్తూనే వున్నాడని, బోజనం కూడా చేయలేదు. అయితే క్రితం రోజు మాత్రం ఘటనస్థలికి తీసుకెళ్లి ఘర్షణకు దారి తీసిన వివరాలను పరిశీలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more