ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడా సంగ్రామంలో భారత్ ఇవాళ మరో స్వర్ణ పతకం గెలుచుకుంది. మహిళల డబుల్ ట్రాప్ షూటింగ్లో భారత షూటర్ శ్రేయసి సింగ్ స్వర్ణ పతకం సాధించింది. నాలుగు రౌండ్ల పాటు ఆస్ట్రేలియాకి చెందిన ఎమ్మా కాక్స్, శ్రేయసి సింగ్ల మధ్య పోటీ జరగ్గా 96 పాయింట్లతో ఇద్దరూ సమానంగా నిలిచారు. దీంతో వీరిద్దరూ మళ్లీ షూటాఫ్కి వెళ్లాల్సివచ్చింది. ఈ సందర్భంగా భారత షూటర్ రెండు సార్లు టార్గెట్ని హిట్ చేయగా... ఎమ్మాకి ఇచ్చిన రెండు షూట్లలో ఒక్కటే హిట్ సాధించింది. దీంతో శ్రేయసికి స్వర్ణం ఖరారైంది.
నాలుగురౌండ్లలో 87 పాయింట్ల సాధించిన స్కాట్లాండ్కి చెందిన లిండా పియర్సన్ కాంస్య పతకం దక్కించుకుంది. కాగా చివరి రౌండ్ వరకు పతకం కోసం రేస్లో ఉన్న భారత షూటర్ వర్ష వర్మన్ 86 పాయింట్లతో వెనుక బడడంతో నిరాశ తప్పలేదు. తాజా కామన్వెల్త్ గేమ్స్లో ఇప్పటి వరకు భారత్కు మొత్తం 23 పతకాలు దక్కాయి. అందులో 12 స్వర్ణం, 4 రజతం, 7 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ మూడో స్థానంలో నిలిచింది.
ఇక మరోవైపు స్వర్ణ పతకాన్ని టార్గెట్ చేసుకున్న భారత హాకీ జట్టుకు కూడా అదే దిశగా పయనిస్తోంది. గ్రూప్-బి లీగ్ లో లాస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. 4-3 తేడాతో ఇంగ్లీష్ టీమ్ పై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభమైనప్పటి నుంచి హోరా హోరిగా సాగిన మ్యాచులో టీమిండియా త్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మ్యాచ్ ముగిసే టైంకి రెండు మూడు గోల్స్ తో లీడ్ లో ఉన్న ఇంగ్లండ్ కు భారీ షాక్ ఇచ్చింది భారత్. చివరి రెండు నిమిషాల్లో మరో రెండు గోల్స్ కొట్టి స్కోర్ ను 4-3 తో లీడ్ లోకి తెచ్చింది. గ్రూప్-B లాస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. దీంతో సెమీస్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది హాకీ ఇండియా.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more