శ్రీవారికి రాజకీయాలు అంటగట్టొద్దని తెగేసి చెప్పారు. వెంకన్న సన్నిధిలో పాలిటిక్స్ బాన్ చేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించకూడదని సూచించారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడేది లేదని తేల్చి చెప్పారు.తిరుపతిలో సినీ, రాజకీయ ప్రముఖుల హడావిడి అంతా ఇంతా కాదు. ప్రముఖులంతా వెంకన్న సన్నిధిలో హల్ చల్ చేస్తారు. మొక్కులు తీర్చాక రాజకీయ పురాణాలు మొదలెడతారు. ప్రతిపక్షాలపై నిప్పులు చెరుగుతారు. కానీ నేతలు ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని టిటిడి తెలిపింది. శ్రీవారి దర్శనార్ధం వచ్చే ప్రముఖులు రాజకీయాలు మాట్లాడొద్దని తిరుమల జేఈవో శ్రీనివాసరాజు సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. దేవాదాయ చట్టం - 30/1987 నిబంధనలకు లోబడి వ్యవహరించాలని సూచించారు. త్వరలోనే ఈవో అనుమతితో కరదీపికలను ముద్రించి ప్రముఖులకు ఈ విషయాన్ని చెబుతామన్నారు. తిరుమలలో కొందరు ప్రముఖులు మాట్లాడటానికి నిరాకరించినా..చాలా మంది మాత్రం రాజకీయాలు మాట్లాడుతున్నారు. శ్రీవారి దర్శనార్ధం వచ్చిన ఎంపి వి.హనుమంతరావు తాజాగా ఇక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతరం మంత్రి ఆనం వివేకానందరెడ్డి కూడా వీహెచ్ పై ఎదురుదాడికి దిగారు. రెచ్చగొట్టేలా మాట్లాడి అలజడి రేపారు. తిరుపతిలో తరచూ జరుగుతున్న ఇటువంటి ఘటనల వలన పుణ్యక్షేత్రం ప్రశాంతతకు భగం వాటిల్లుతోంది. నాయకుల మాటల తూటాలు, విమర్శలతో తిరుపతి పవిత్రత దెబ్బతింటోంది. అందుకే టిటిడి అధికారులు ఓ అడుగు ముందుకేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దేవాదాయ చట్టం 30/1987 ను అమలు చేయాలని టిటిడి భావిస్తోంది. ఇటీవలికాలంలో తిరుమలకు వచ్చే సినీ, రాజకీయ ప్రముఖులు చేసే ప్రకటనలు టిటిడికి ఇబ్బందిగా మారుతున్నాయి. శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం వెలుపల వారు చేసే ప్రకటనలు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటున్నాయి. అందుకే ఆలయ అధికారులు తిరుమల క్షేత్రంలో రాజకీయాలు బాన్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more