సీమాంద్ర ప్రజలు సమైక్యాంద్ర కోసం సాగించిన ఉద్యమం దెబ్బకు కాంగ్రెస్ హైకమాండ్ .. ఆంటోని కమిటి వేసిన విషయం తెలిసిందే. సీమాంద్ర నాయకులు ఆంటోనీ కమిటీ ముందు తమ గోడు వెల్లబోసుకోవచ్చనని కాంగ్రెస్ హైకమాండ్ చెప్పటం జరిగింది. కానీ చివరకు ఆంటోనీ కమిటి ఆవిరైపోయింది. తెలంగాణ ప్రకటన అనంతరం సీమాంధ్ర ప్రాంతంలో చెలరేగిన ఆందోళనలను చల్లార్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన ఆంటోనీ కమిటీ కాస్తా అటకెక్కేసింది. కమిటీలో ఉన్నదే ఇద్దరు సభ్యులు. వారిలో ఒకరు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కాగా.. మరొకరు చమురుశాఖ మంత్రి వీరప్పమొయిలీ. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు, ఇతరులు వెళ్లి, రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలు ఏంటన్న విషయాన్ని చెప్పుకోడానికి వీలుగా ఈ కమిటీని పార్టీ తరఫున ఏర్పాటు చేశారు. కానీ కొన్నాళ్ల పాటు నాయకులు వెళ్లి వచ్చిన తర్వాత.. ఆంటోనీ అనారోగ్యం పాలయ్యారు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో ఆయన ఆస్పత్రి పాలు కావడం, శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడంతో కమిటీ పని దాదాపుగా ఆగిపోయింది.
తొలుత రాష్ట్రానికి కూడా ఆంటోనీ కమిటీని ఆహ్వానిస్తున్నట్లు సీమాంధ్రప్రాంత కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంతా చెప్పారు. కానీ అది జరగలేదు. ఆ తర్వాత ప్రభుత్వం తరఫున మంత్రుల బృందం ఒకదాన్ని ఏర్పాటు చేశారు. మొదట్లో 11 మందితో ఏర్పాటుచేసిన బృందం నుంచి తర్వాత కొంతమందిని తొలగించి, మరికొందరిని కలిపి చివరకు ఏడుగురితోనే సరిపెట్టేశారు. కేవలం సీమాంధ్ర ప్రాంతంలో తీవ్రస్థాయిలో ఉన్న నిరసన జ్వాలలను చల్లార్చేందుకు, తెలంగాణ విషయంలో మరింత కాలయాపన చేసేందుకే కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తోందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఆంటోనీ కమిటీ ఏమైందని, దాని పరిస్థితి ఏంటని కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీని విలేకరులు ప్రశ్నించినప్పుడు.. కమిటీ స్టేటస్ ఏంటో కూడా తనకు తెలియదని మొయిలీ అన్నారు. దీనిని బట్టి చూస్తే .. సీమాంద్ర ప్రజల మనోభావాల మీద కాంగ్రెస్ హైకమాండ్ దెబ్బకొట్టినట్లు కనిపిస్తుంది. ఇంక మన నాయకులు ఆంటోనీ కమిటి వస్తుందనే ఉద్దేశంతో ఎదురుచూపులు చూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 30 | ... Read more
Dec 25 | ... Read more
Oct 16 | సీమాంద్రలో ఉద్యమం వెనకు ఉన్న వ్యక్తి సీఎం కిరణ్ కుమార్ రెడ్డే అని , తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు గొంతుచించుకొని అరిచారు. ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పర్చురి అశోక్ బాబుకు... Read more
Oct 16 | కోట్ల మంది అభిమానులకు దైవంగా మారిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు.. తల్లి అంటే అమితమైన ఇష్టం. ఆ తల్లి కోసం సచిన్ చివరి కోరిక బీసీసీఐ ముందు ఉంచటం జరిగింది. నా... Read more