Patient bought carried from 50 kilometers for treatment on bed

patient, carring, 50 kilometers, treatment, tied on bed, No Doctors, No Hospitals, sukuma, Agendy areas

patient bought carried from 50 kilometers for treatment on bed

గాలిలో దీపాలుగా మారుతున్న ఆదివాసీల ప్రాణాలు..

Posted: 11/16/2014 08:26 PM IST
Patient bought carried from 50 kilometers for treatment on bed

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు గడుస్తున్నా.. గిరిజనులకు, ఏజెన్సీ ప్రాంత వాసులకు వైద్యం అందని ద్రాక్షాగానే మారింది. పాలకులు మారినా, అధికార యంత్రాంగం మారినా.. వైద్యం కోసం గిరిజనుడు అపసోపాలు పడాల్సి వస్తుంది. ఇందుకు ఈ సుకుమా జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. గత పది రోజులుగా సుకుమా జిల్లా పాలగూడ గ్రామానికి చెందిన జోగా అనే గిరిజనుడు తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. నాటు వైద్యంపై కొన్ని రోజులుగా పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. దీంతో ప్రభుత్వ వైద్య అస్పత్రికి తీసుకెళ్లడమే మంచిదనుకున్నారు గ్రామ పెద్దలు.

అక్కడి నుంచి ఖమ్మం జిల్లా చర్లకు తీసుకురావాలంటే కనీసం 50 కిలోమీటర్లు. అందులోనూ రోగి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. అంతనికి ఎలాంటి అపాయం కలగకుండా.. అస్పత్రికి తీసుకురావాలి. ఇందుకు ఓ కారో, ట్రాక్టరో కాదు, కనీసం ఎడ్లబండి, జట్కాబండినో మాట్లాడలేదు. పాత సినిమాల్లో చూసినట్లు రోగిని జట్టిలో పడుకోబెట్టి ఇద్దరు కుర్రాళ్లు మోసుకోచ్చారు. దీని బట్టి ఆదివాసీలకు అందుతున్న సౌకర్యాలు ఎలా వున్నాయో అర్థమవుతోంది. 50 కిలోమీటర్ల దూరం వరకు ఓ అస్ప్రతి లేదు. కనీస వైద్యం చేయడానికి ఓ వైద్యుడు లేదు. 50కి.మీ. దూరం నుంచి ఆదివాసీలు ప్రాణాపాయ స్థితిలో ఉన్న జోగాను మోసుకొస్తున్న క్రమంలో ఏం జరిగినా దేవుడిపైనే భారం. ఇప్పటికీ అదివాసీల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారుతున్నాయనడానికి ఇంతకన్న నిదర్శమేమి కావాలి. శనివారం ఉదయం గ్రామం నుంచి బయల్దేరిన వారు దాదాపు 24గంటల అనంతరం చర్లకు చేరుకున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : patient  carring  50 kilometers  treatment  tied on bed  No Doctors  No Hospitals  sukuma  Agendy areas  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more