మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ చౌతాలాలు ముందంజలో వున్నారు. అదేంటి ఇవాళే మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతుండగా.. వారు ముందంజలో ఎలా వున్నారు..? అప్పుడే ఓట్లను లెక్కిస్తున్నారా..? 19న కదా ఓట్ల లెక్కింపు, మరి వీరు ముందంజలో ఎలా కొనసాగుతున్నారు..? వారు ముందంజలో కొనసాగుతున్నారన్నది నిజం. అయితే అది ఓట్ల లెక్కింపులో కాదు. మహారాష్ట్ర, హర్యానాలో ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలను గూగుల్లో అన్వేషిస్తున్న వారిలో రాజ్థాక్రే, ఓం ప్రకాశ్ చౌతాలా అగ్రస్థానంలో నిలిచారు.
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్థాక్రే, హర్యానాలో ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ) అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా గురించి ఆయా రాష్ట్రాలతో పాటు దేశం నుంచి అధిక శాతం మంది నెట్ జనులు వీరిని సర్చ్ చేశారు. ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి వీరి గురించి తెలుసుకునేందుకు నెట్ జనులు అసక్తి కనబర్చారు. మహారాష్ట్రలో రాజ్థాక్రే, హర్యానాలో ఓం ప్రకాశ్ చౌతాలాల గురించి, వారి వివరాలు, పార్టీల గురించి నెట్ జనులు ఎక్కువగా అనే్వషించారు. ఈ మేరకు సర్చ్ ఇంజన్ 'గూగుల్' ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శివసేన నేత ఉద్ధవ్ థాక్రే కంటే రాజ్థాక్రే మహారాష్ట్రలో ముందంజలో ఉన్నారని గూగుల్ తెలిపింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్, బీజేపి నేత దేవేంద్ర ఫడ్నవీస్, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్, ఆర్ఆర్ పాటిల్ తర్వాతి వరుసలో ఉన్నారు. హర్యానాలో ఐఎన్ఎల్డీ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా అగ్రస్థానంలో నిలవగా, హర్యానా లోక్హిత్ పార్టీ నేత గోపాల్ కందా, హర్యానా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా తర్వాతి స్థానాల్లో నిలిచారు. ముఖ్యమంత్రి కావాలని కలలుకంటున్న హర్యానా జనహిత్ కాంగ్రెస్ అధినేత కులదీప్ బిష్ణోయ్ నాలుగో స్థానంలో నిలిచినట్లు గూగుల్ తెలిపింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more