4 year jail for three in alipiri bomb blast case

Alipiri attack, chandrababu naidu, court, judgement, 4 year jail. convicts

4 year jail for three in alipiri bomb blast case

అలిపిరి కేసులో దోషులకు నాలుగేళ్లు జైలు

Posted: 09/25/2014 03:23 PM IST
4 year jail for three in alipiri bomb blast case

రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేకెత్తించిన అలిపిరి బాంబు ఘటన కేసులో ముగ్గురునిందితులకు న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ గా జరిగిన అలిపిరి బాంబు దాడి కేసులోని ముగ్గురు దోషులకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానాను విధిస్తూ తీర్పు వెల్లడించింది. 2003 అక్టోబర్‌లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని తిరుపతి సమీపంలో అలిపిరి వద్ద నక్సల్స్‌ దాడికి ఒడిగట్టారు.
 
ఈ కేసులో నిందితులు రామ్మోహన్‌రెడ్డి, నరసింహారెడ్డి అలియాస్ రాజశేఖర్, ఎం.చంద్ర అలియాస్ కేశవులును దోషులగా నిర్థారిస్తూ న్యాయస్థానం ఈ శిక్షలు ఖరారు చేసింది. తిరుమల స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళుతున్న బాబుపై ఈ దాడి జరిగింది. అయితే తామిప్పడు మావోయిస్టు కార్యకలాపాల్లో లేమని,  ఎప్పుడో జనజీవన స్రవంతిలో కలిసిపోయామని దోషులు కోర్టుకు విన్నవించుకున్నారు. తమ వాదనను కోర్టు వినిపించుకోలేదని ఈ తరుణంలో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు దోషులు నర్సింహారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, కేశవ్ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alipiri attack  chandrababu naidu  court  judgement  4 year jail. convicts  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more