(Image source from: varavaravarao and haragopal fires cm kcr)
గతకొన్ని రోజులనుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ మీద రకరకాల ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఆయన ప్రవహిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని.. సీఎం హోదాలో వుండి కూడా ఒక ఉద్యమకారుడిగానే వ్యవహరిస్తున్నారని ప్రత్యర్థ నాయకుల విమర్శిస్తున్నారు. అలాగే మీడియా ప్రతినిధులు కూడా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే జాతీయ నాయకులు కూడా కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈయన్ను హిట్లర్ సీఎంగా ప్రతిఒక్కరు అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈయన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వరవరవరావు, మానవహక్కుల ఉద్యమనేత హరగోపాల్ మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మూడునెలల్లోనే కేసీఆర్ ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. ప్రజాసంఘాల నేతల అరెస్టును తాము తీవ్రస్థాయిలో ఖండిస్తున్నట్లు చెప్పారు. అర్థరాత్రి సమయంలో ఉద్యమనాయకులను అరెస్టు చేసి.. ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న కార్యక్రమాలను అడ్డుకోవడం తగదన్నారు. భవిష్యత్తులో కూడా కేసీఆర్ ఇలాగే వ్యవహరిస్తే తెలంగాణాలో మరో ఉద్యమం తప్పదని హెచ్చిరికలు జారీ చేశారు. కాళోజీ, జయశంకర్ వంటి మహామేధావులు ఇలాంటి తెలంగాణాను కోరుకోలేదని.. ఈ విషయంలో కేసీఆర్ త్వరగా తన వైఖరిని మార్చుకోవాలని వారిద్దరూ స్పష్టం చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more