Khairatabad ganesh procession stopped

khairatabad ganesh, khairatabad vinayaka, hyderabad ganesh immersion, ganesh immersion, latest news, hyderabad, telangana, police

khairatabad ganesh procession stopped by police to avoid office going peoples disturbance : police stops khairatabad ganesh procession, immersion programme

ఖైరతాబాద్ గణేషుడి యాత్ర నిలిపేసిన పోలిసులు

Posted: 09/09/2014 09:32 AM IST
Khairatabad ganesh procession stopped

ఖైరతాబాద్ మహా గణేషుడి శోభాయాత్ర కార్యక్రమం నిలిచిపోయింది. నిమజ్జనం ఆలస్యం అవుతుందని భావించిన ఉత్సవ కమిటీ యాత్రను నిలిపివేసింది. అర్ధరాత్రి రెండు గంటల తర్వాత ఖైరతాబాద్ వినాయకుడిని వాహనంపైకి భారీ క్రేన్ సాయంతో చేర్చారు. అనంతరం వెల్డింగ్ పనులు పూర్తి చేశారు. అప్పటికే సమయం తెల్లవారుజామున మూడు గంటలు దాటింది. ఆ సమయంలో శోభాయాత్ర ప్రారంభించటానికి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసుకుంది. అయితే పోలిసులు ఆ సమయంలో శోభాయాత్ర చేసేందుకు అనుమతివ్వలేదు.

మూడు గంటల తర్వాత శోభాయాత్ర ప్రారంభం అయితే ఉదయం దాదాపు పది గంటలు దాటాక యాత్ర పూర్తవుతుందని భావించారు. దీంతో కార్యాలయాలకు వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందులు తప్పవని శోభాయాత్రకు అనుమతివ్వటంలేదని తేల్చి చెప్పారు. దీంతో శోభాయాత్రను ఉదయం వరకు నిర్వహించలేదు. యాత్రను చూడటానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పోలీసుల తీరు వల్ల తీవ్ర నిరాశ చెందారు. అనుమతి లేకపోవటంతో చేసేదేమి లేదని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు చెప్తున్నారు.

ఖైరతాబాద్ నుంచి చంద్ విహార్ హోటల్, సెన్సేషన్ సినిమా థియేటర్, రాజ్ దూత్ హోటల్, సచివాలయం గేట్ 1, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుంచి ట్యాంక్ బండ్ కు శోభాయాత్ర చేరుకుంటుంది. గతంలో ప్రతిసారి అర్ధరాత్రి యాత్ర ప్రారంభమై...తెల్లవారుజాము వరకు యాత్ర పూర్తయ్యేది. అయితే ఈ సారి సామాన్య ప్రజల సౌకర్యార్దం వినాయకుడే తన నిమజ్జనంను కాసేపు వాయిదా వేసుకున్నాడు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : khairatabad ganesh  immersion  latest news  hyderabad  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more